ETV Bharat / bharat

పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ.. ఆరుగురు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

author img

By

Published : Jan 29, 2023, 10:25 AM IST

Updated : Jan 29, 2023, 12:02 PM IST

Uttar Pradesh Road accident several killed
రోడ్డు ప్రమాదం

ఉత్తర్ ​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. ఓ లారీ అదుపు తప్పిన రోడ్డు పక్కనే ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఉత్తర్‌ ప్రదేశ్‌ లఖింపుర్‌ ఖేరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంగి గ్రామంలో వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదానికి ముందు శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో పంగి ఖుర్ద్ గ్రామ సమీపంలోని పిలిభిత్​ బస్తీ రహదారిపై బహ్రైచ్ వైపు వెళ్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న వ్యక్తి గాయపడ్డాడు. వెంటనే స్థానికులు ఘటనా స్థలం చుట్టూ గుమిగూడారు. అదే సమయంలో బహ్రెయిచ్​ నుంచి వేగంగా వస్తున్న లారీ జనాలపైకి దూసుకెళ్లి కాలువలో పడింది. దీంతో ఆరుగురు మరణించగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Last Updated :Jan 29, 2023, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.