ETV Bharat / bharat

'ఇండోపసిఫిక్​ సుస్థిరతకు అమెరికా-భారత్​ బంధం కీలకం'

author img

By

Published : Mar 20, 2021, 1:40 PM IST

US Defence Secretary attends wreath-laying ceremony at National War Memorial in Delhi
'శాంతి స్థాపనకు భారత్​తో బంధం పట్టుకొమ్మ వంటిది'

అమెరికా, భారత్ రక్షణ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, రాజ్​నాథ్​ సింగ్​ల మధ్య చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఇరుదేశాలూ రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని, ఇండో పసిఫిక్​ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు సహకరించుకోవాలని నిర్ణయించాయి.

దిల్లీలో భారత్, అమెరికా రక్షణ మంత్రుల అత్యున్నత స్థాయి సమావేశం శనివారం ముగిసింది. రక్షణ మంత్రులు రాజ్​నాథ్ సింగ్, లాయిడ్ జేమ్స్​ ఆస్టిన్ ఉన్నతాధికారులతో కలిసి భేటీ అయ్యారు. ఆస్టిన్​తో అద్భుతమైన, ఫలప్రద చర్చలు జరిగాయని రాజ్​నాథ్ పేర్కొన్నారు.

US Defence Secretary attends wreath-laying ceremony at National War Memorial in Delhi
ఇరుదేశాల అత్యున్నత సమావేశం

"ఆస్టిన్​, ఆయన బృందంతో సమగ్రమైన భేటీ జరిగింది. ఎన్నో ద్వైపాక్షిక, బహుపాక్షిక ఒప్పందాలను సమీక్షించాం. ఎల్​ఈఎంఓఏ, కామ్​కాసా, బెకా ఒప్పందాలపై సంతకాలు చేశాం. భారత్-అమెరికా రక్షణ సంబంధాల బలోపేతానికి మరింత సహకరించుకోవాలని అంగీకరించాం. సైనిక విస్తరణ, సమాచార మార్పిడి, రవాణాలో పరస్పర సహకారం అందించాలని నిర్ణయించాం."

-రాజ్​నాథ్ సింగ్, భారత రక్షణ మంత్రి

ఈ సమావేశానికి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు కూడా హాజరయ్యారు.

US Defence Secretary attends wreath-laying ceremony at National War Memorial in Delhi
హాజరైన త్రివిధ దళాల అధిపతులు

వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామ క్రమంలో అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అన్నారు లాయిడ్ ఆస్టిన్. తమ ఇండో పసిఫిక్ విధానంలో భాగంగా భారత్​కు రక్షణ రంగంలో మరింత సహకారం అందిస్తామని తెలిపారు.

"ఇండో పసిఫిక్ ప్రాంత స్వేచ్ఛ, సుస్థిరతలో భారత్-అమెరికా బంధం పట్టుకొమ్మ వంటింది. స్వేచ్ఛా నౌకాయానం, విమానయానం, వాణిజ్యానికి మోదీ హామీ ఇచ్చారు. ప్రాంతీయ భద్రతకు ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయి."

- లాయిడ్ ఆస్టిన్, అమెరికా రక్షణ మంత్రి

US Defence Secretary attends wreath-laying ceremony at National War Memorial in Delhi
నివాళి అర్పిస్తున్న ఆస్టిన్

రాజ్​నాథ్​తో భేటీకి ముందు దిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు ఆస్టిన్. అనంతరం విజ్ఞాన్​ భవన్​లో సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.

US Defence Secretary attends wreath-laying ceremony at National War Memorial in Delhi
ఆస్టిన్​కు గౌరవ వందనం

మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న ఆస్టిన్​.. శుక్రవారమే భారత్​ చేరుకున్నారు. తొలి రోజు ప్రధాని మోదీ సహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ ఢోబాల్​తో ఆయన సమావేశయ్యారు.

ఇదీ చూడండి: మోదీతో అమెరికా రక్షణ మంత్రి భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.