ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​ ఆరో విడత ఎన్నికలు షురూ.. 57 స్థానాల్లో పోలింగ్

author img

By

Published : Mar 3, 2022, 7:05 AM IST

Updated : Mar 3, 2022, 7:30 AM IST

up election 2022
పూర్వాంచల్​ ఎన్నికలు

UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్​లోని పూర్వాంచల్​ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. 111 స్థానాల్లో 57 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది.

UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్​లో ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 111 స్థానాలు ఉండే పూర్వాంచల్​ ప్రాంతంలోని 57 స్థానాలకు గురువారం ఓటింగ్ జరుగుతోంది. యూపీలో ఇప్పటివరకు 403 స్థానాలకుగానూ 292 సీట్లకు ఎన్నికలు జరిగాయి.

అంబేడ్కర్ నగర్, బలరాంపుర్, సిద్ధార్థ్​నగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహారాజ్ గంజ్, గోరఖ్​పుర్, ఖుషీనగర్, దేవరియా, బలియా జిల్లాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 జిల్లాల్లోని ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా భాజపా, ఎస్పీ కూటముల మధ్యే పోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఓటు వేసిన సీఎం..

గోరఖ్​పుర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ​ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.. కన్యా నగర్​ క్షేత్రలోని పోలింగ్​ కేంద్రం వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు గోరఖ్​నాథ్​ ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు.

UP Election 2022
పోలింగ్ కేంద్రం వద్ద సీఎం
UP Election 2022
ఓటు వేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
up election 2022
గోరఖ్​నాథ్​ ఆలయంలో యోగి ఆదిత్యనాథ్​
UP Election 2022
పూజలు నిర్వహిస్తున్న యోగి

ఇదీ చూడండి : యుద్ధ ప్రాతిపదికన పౌరుల తరలింపు... పాస్​పోర్ట్ లేకున్నా..

Last Updated :Mar 3, 2022, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.