ETV Bharat / bharat

భారత్​లో కరోనా టీకా పంపిణీకి ఏడాది.. కీలక మైలురాళ్లు ఇవే..

author img

By

Published : Jan 16, 2022, 12:02 PM IST

Updated : Jan 16, 2022, 12:59 PM IST

Vaccination
భారత్​లో కరోనా టీకా పంపిణీకి ఏడాది

India vaccination drive: భారత్​లో కరోనా టీకా పంపిణీ.. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైనదిగా అభివర్ణించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయా. వ్యాక్సినేషన్​ ప్రారంభించి ఆదివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా ట్వీట్​ చేశారు. ఈ సందర్భంగా.. టీకా పంపిణీలో భారత్​ సాధించిన కీలక మైలురాళ్లపై ఓ సారి లుక్కేద్దాం.

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చి ఆదివారానికి ఏడాది పూర్తవుతోంది. 2021, జనవరి 16న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్​ డ్రైవ్​కు శ్రీకారం చుట్టింది కేంద్రం. ఇప్పటి వరకు 156 కోట్ల డోసులు ( 90 కోట్ల మందికిపైగా తొలి డోసు, 65 కోట్ల మందికిపైగా రెండు డోసులు, 42 లక్షల మందికిపైగా ప్రికాషనరీ డోసులు) అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది భారత్​.

ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీకా పంపిణీగా పేర్కొన్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుఖ్​ మాండవీయా. ట్వీట్టర్​ వేదికగా టీకా ప్రారంభమైన నాటి నుంచి సాధించిన కీలక మైలురాళ్లను వెల్లడించారు.

" భారత్​లో వ్యాక్సినేషన్​ డ్రైవ్​.. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ప్రక్రియ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ స్ఫూర్తిమంతమైన, ముందుచూపు గల నాయకత్వంలో కరోనాపై దేశ సమ్మిళిత పోరాట గొప్పతనాన్ని ఏడాదిగా సాగుతున్న టీకా పంపిణీ స్పష్టం చేస్తుంది."

- మాన్​సుఖ్​ మాండవీయా, కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ.

భారత్​ టీకా పంపిణీలో కీలక మైలురాళ్లు..

Vaccination
భారత్​ టీకా పంపిణీలో కీలక మైలురాళ్లు
Vaccination
భారత్​ టీకా పంపిణీలో కీలక మైలురాళ్లు
Vaccination
భారత్​ టీకా పంపిణీలో కీలక మైలురాళ్లు
Vaccination
భారత్​ టీకా పంపిణీలో కీలక మైలురాళ్లు

ఇదీ చూడండి: One Year For Vaccination: దేశంలో టీకా ప్రక్రియ మొదలై నేటికి ఏడాది..

వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న దేశాలు.. భారత్ ఎన్నో స్థానమంటే?

Last Updated :Jan 16, 2022, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.