ETV Bharat / bharat

Cabinet Expansion: షాతో మోదీ భేటీ- ఏ క్షణమైనా ప్రకటన!

author img

By

Published : Jul 5, 2021, 10:37 PM IST

కేంద్ర మంత్రివర్గ విస్తరణపై(Cabinet Expansion) చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్​లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఏ క్షణమైనా కేబినెట్ విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బుధవారమే నూతన మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని వెల్లడించాయి.

Cabinet expansion
షాతో మోదీ భేటీ

కేంద్ర కేబినెట్ విస్తరణ(Cabinet Expansion) వార్తల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్​లతో సమావేశమయ్యారు. కేబినెట్​లో మార్పులకు సంబంధించిన జాబితాకు ఈ సమావేశంలో తుది మెరుగులు దిద్దినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో షా, సంతోష్.. తమ అభిప్రాయాలను స్పష్టంగా పంచుకున్నారని పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా కేబినెట్ విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. 2019 మే తర్వాత మంత్రి మండలిలో మార్పులు జరగడం ఇదే తొలిసారి కానుంది. బుధవారమే నూతన మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వీరికి పక్కా..

అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, జోతిరాదిత్య సింధియా, సుశీల్ మోదీలకు మంత్రివర్గంలో చోటు ఖాయంగా కనిపిస్తోంది. భాజపా మిత్రపక్షాలకు కూడా కేబినెట్​లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీకి మంత్రివర్గంలో పెద్దపీట వేసే అవకాశం ఉంది. బంగాల్​ నేతలకు సైతం ప్రాతినిధ్యం దక్కనుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.