ETV Bharat / bharat

బజరంగ్​ దళ్ కార్యకర్త హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Feb 23, 2022, 3:32 PM IST

Updated : Feb 23, 2022, 3:48 PM IST

Bajrang Dal activist murder case: కర్ణాటకలో జరిగిన బజరంగ్‌ దళ్‌ కార్యకర్త హత్య కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే శివమొగ్గ పరిధిలో అమల్లో ఉన్న 144 సెక్షన్​ను మరో రెండు రోజు పాటు పొడిగించారు.

Bajrang Dal activist murder case
బజరంగ్​ దళ్ కార్యకర్త హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్​

Bajrang Dal activist murder case: కర్ణాటక శివమొగ్గలో ఉద్రిక్తతలకు దారితీసిన బజరంగ్‌ దళ్‌ కార్యకర్త హర్ష హత్య కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. శుక్రవారం వరకు 144 సెక్షన్​ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా కేంద్రంలోని రెండు పోలీస్​ స్టేషన్​లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కూడా విచారణకు అదేశించారు ఆ రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర. శివమొగ్గలోని కోటే, దొడ్డపేట పోలీస్ స్టేషన్​ల పనితీరుపై విచారణ చేపట్టాల్సి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ రెండు పోలీస్ స్టేషన్లలో గత ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎంత మంది ఉన్నారు, వారు నిందితుల పట్ల తీసుకున్న చర్యలపై సమీక్షించాల్సి ఉంటుందని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారి వల్లే ఇలాంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వారు గతంలో భారీగానే నేరాలకు పాల్పడినట్లు తెలిపారు.

హర్ష హత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు శివమొగ్గ పోలీసు సూపరింటెండెంట్ బీఎమ్ లక్ష్మీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరికొంతమందిని విచారిస్తున్నామని వివరించారు.

హర్ష హత్య అనంతరం సంబరాలు...

బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష దారుణ హత్యకు సంబంధించి కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హిందుత్వ అజెండాను అనుసరించినందుకే హర్షను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన తరువాత కొందరు సామాజిక మాధ్యమాల్లో సంబరాలు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ హత్యలో ఓ సంస్థ ప్రమేయం ఉన్నట్లు కూడా దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ హత్య కేసులో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ), పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) పాత్రకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిపారు. హిజాబ్​ విషయంలో క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్​ఐ) పాత్ర ఏంటి అనే దానిపై కూడా ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'దావూద్​' మనీలాండరింగ్​ కేసులో ఈడీ విచారణకు నవాబ్​ మాలిక్​

Last Updated :Feb 23, 2022, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.