ETV Bharat / bharat

బస్​ హైజాక్ కేసులో ఎంపీ కుమారుడు అరెస్ట్

author img

By

Published : Jun 24, 2022, 6:07 PM IST

Updated : Jun 24, 2022, 7:27 PM IST

డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ కుమారుడు సూర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్య ప్రస్తుతం భాజపా ఓబీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. తమ నేత అరెస్ట్​కు నిరసనగా పోలీస్​ స్టేషన్​ ఎదుట భాజపా శ్రేణులు ధర్నాకు దిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

trichy siva son arrest
తిరుచ్చి శివ కుమారుడు అరెస్ట్

డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ కుమారుడు సూర్య శివను గురువారం రాత్రి తిరుచ్చి కంటోన్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. జూన్​11 అర్ధరాత్రి సూర్య శివ కారును శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అనంతరం డ్రైవర్​ను బెదిరించి సూర్య శివ బస్సును తీసుకెళ్లాడని కేసు నమోదైంది. సూర్య శివ అరెస్టుకు నిరసనగా 20మంది భాజపా కార్యకర్తలతో జిల్లా నాయకుడు రాజశేఖర్.. పోలీస్​ స్టేషన్​ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సూర్య శివ ప్రస్తుతం భాజపా ఓబీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ కుమారుడు అరెస్ట్

"నా కారును ఢీకొన్న బస్సుకు పర్మిట్‌, ఇన్సూరెన్స్‌ లాంటి పత్రాలేవీ లేవు. శ్రీకృష్ణా ట్రావెల్స్‌ పర్మిట్‌ లేకుండా నకిలీ పత్రాలతో ఇప్పటి వరకు 20కి పైగా బస్సులను నడుపుతోంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి, మరో మంత్రి మహేష్ పొయమొళి ఆదేశాల మేరకే శ్రీకృష్ణ ట్రావెల్స్​ నాపై తప్పుడు కేసులు పెట్టింది. డీఎంకేలోని కీలక మంత్రుల రహస్యాలు బయటపెడితే వారు బయట తిరగలేరు. మహేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైతే ఆయనతో ముఖాముఖికి నేను సిద్ధం."

-తిరుచ్చి సూర్య శివ

ఇవీ చదవండి: 'అగ్నిపథ్​లో ఎన్​సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు'

అంధవిశ్వాసం.. గుడిలో నాలుక కోసేసుకున్న భక్తురాలు

Last Updated :Jun 24, 2022, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.