ETV Bharat / bharat

మూఢనమ్మకాలతో కన్నబిడ్డనే కొట్టి చంపిన తల్లి!

author img

By

Published : Jun 21, 2021, 5:31 PM IST

Updated : Jun 21, 2021, 8:22 PM IST

ఓ బాలుడి అనుమానస్పద మృతి కేసులో పోలీసులకు ఒళ్లు గగుర్పొడిచే విషయాలు తెలిశాయి. కుమారునికి దెయ్యం పట్టిందని భావించిన తల్లి.. చికిత్స అందించడానికి బదులు తీవ్రంగా కొట్టినట్లు దర్యాప్తులో తేలింది.

Mysterious death
మూఢనమ్మకాలు

మూఢనమ్మకాలతో కన్నబిడ్డపై చిత్రహింసలు

తమిళనాడులో ఓ బాలుని అనుమానస్పద మృతిపై ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్​ చేశారు. మూఢనమ్మకాలతో నిందితులు బాలున్ని చిత్రహింసలకు గురిచేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తిరువణ్ణామలైజిల్లా కన్నమంగళం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

దెయ్యం పట్టిందని..

తిలకవతి అనే మహిళ తన కుమారుడు శబరి(7)తో కలిసి వెల్లూరులో నివసించేది. తన కుమారునికి దెయ్యం పట్టిందని భావించి కన్నమంగళంలోని ఓ మాంత్రికుణ్ని సంప్రదించింది. తన సోదరిలతో కలిసి బాలున్ని తీసుకుని అక్కడకు వెళ్లింది. ఆ రాత్రి అక్కడే బస చేశారు. ఈ క్రమంలో బాలునికి మూర్చ వచ్చింది. ఆ తర్వాత బాలుడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి వచ్చారు. చికిత్స అందించే బదులు తన తోబుట్టువులతో కలిసి బాలుణ్ని తీవ్రంగా కొట్టామని నిందితురాలు ఒప్పుకుంది.

ఇదీ చదవండి:దేవుడి పేరు చెప్పి బాలికకు తాళి కట్టిన పాస్టర్

సొంత కుటుంబాన్ని కడతేర్చి.. చివరకు తానూ..

Last Updated : Jun 21, 2021, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.