ETV Bharat / bharat

మహిళా రైతులపైకి దూసుకెళ్లిన ట్రక్కు- ముగ్గురు మృతి

author img

By

Published : Oct 28, 2021, 12:52 PM IST

హరియాణాలో దారుణం జరిగింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న మహిళా రైతులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఘటన సమయంలో వీరంతా ఆటో కోసం ఎదురుచూస్తూ డివైడర్​పై కూర్చున్నారని పోలీసులు తెలిపారు.

Three women protesting farmers run over by truck in Haryana
డివైడర్​పైకి దూసుకెళ్లిన ట్రక్కు

సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. హరియాణా బహాదుర్​గఢ్​లో (Bahadurgarh news) గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళా రైతులు (Farmers killed) ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళా రైతు గాయపడ్డారు. కాలికి తీవ్ర గాయం అయిన ఆమెను రోహ్​తక్​లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు.

Three women protesting farmers run over by truck in Haryana
మహిళా రైతులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

ఇద్దరు మహిళా రైతులు ఘటనాస్థలిలోనే మరణించగా.. మరొకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులను భాన్ సింగ్(60), హర్జీత్ సింగ్(58), భోలా సింగ్(60)గా గుర్తించారు.

ఆటో కోసం ఎదురుచూస్తుండగా..

నిరసన చేస్తున్న ఏడుగురు మహిళలు ఝాజ్జర్​ రహదారి డివైడర్​పై కూర్చున్నారని ఎస్​పీ వసీమ్ అక్రమ్ తెలిపారు. ఆటో కోసం వీరంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెల్లవారుజామున 5.30 గంటలకు ఘటన జరిగిందని, ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ పారిపోయాడని చెప్పారు. వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు.

ఇదీ చదవండి: నిరసనలో హింస- ఇద్దరు రైతులు సహా 8 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.