ETV Bharat / bharat

తిమింగలం వాంతితో కోట్ల దందా... ముగ్గురు అరెస్టు

author img

By

Published : Apr 24, 2022, 5:55 AM IST

Ambergris Smuggling: అంబర్​గ్రీస్​ను అక్రమ రవాణా చేసేందుకు యత్నించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు దిల్లీ పోలీసులు. వారి నుంచి రూ.22 కోట్లు విలువ చేసే పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అంబర్​గ్రీస్​ను విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఈ క్రమంలో తాము కొనుగోలుదారులుగా నమ్మించి వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తిమింగలం
తిమింగలం

Ambergris Smuggling: కోట్ల రూపాయలు విలువ చేసే అంబర్​గ్రీస్​ను (తిమింగళం వాంతి) అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు దిల్లీ పోలీసులు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు. వీరు దిల్లీలోని మయూర్​ విహార్​కు చెందిన గౌతమ్ కుమార్​ అలియాస్ శివ్​, ఉత్తరాఖండ్​కు చెందిన రాజేశ్​ జోషి, ఉత్తర్​ప్రదేశ్​లోని సహిబాబాద్​కు చెందిన రోహిత్​ సాగర్​లుగా గుర్తించారు పోలీసులు. నిందితుల నుంచి రూ.22 కోట్లు విలువ చేసే అంబర్​గ్రీస్​, రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు.

"ఏప్రిల్​ 21న నిందితులు రాజేశ్​ జోషి, గౌతమ్​కుమార్​లు అంబర్​గ్రీస్​ విక్రయించేందుకు కొనగోలదారుల కోసం వెతుకుతున్నట్లు మాకు సమాచారం అందింది. ఈ క్రమంలో అధికారుల ప్రత్యేక బృందం వారిని సంప్రదించి బయర్లుగా నమ్మించారు. లాజ్​పత్​ నగర్​లోని నిందితుల చెప్పిన ప్రాంతానికి వెళ్లిన అధికారులు వారిని అరెస్ట్​ చేశారు. ఆ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు దానిని పరీక్షలకు తరలించగా అది అంబర్​గ్రీస్​గా నిర్ధరణ అయింది." అని పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అంబర్​​గ్రీస్ పదార్థం సాధారణంగా తిమింగలం జీర్ణవ్యవస్థలో తయారవుతుంది. అది వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్లు, పర్​ఫ్యూమ్​ల తయారీలో దీనిని వినియోగిస్తారు. ఒక్క కిలో అంబర్​​​గ్రీస్​కు రూ.కోట్లలో ధర ఉంటుంది. ఇండోనేషియా, ఇంగ్లాండ్​లో ఈ పదార్థానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంబర్​ గ్రీస్​ను 1972 వన్యప్రాణుల చట్టం కింద నిషేధించారు.

ఇదీ చూడండి : పంజాబ్​ సీఎం మరో కీలక నిర్ణయం.. వారికి భద్రత కట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.