ETV Bharat / bharat

'ప్రధాని మోదీ విజన్​లో వాళ్లు మాత్రమే ఉంటారు'

author img

By

Published : May 24, 2022, 11:37 AM IST

Rahul gandhi london: ప్రధాని మోదీ విజన్​లో దేశ ప్రజలు అందరూ ఉండరని.. కొంతమంది ప్రయోజనాలను మాత్రమే పరిగణిస్తారని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. భారత్​లో ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

రాహుల్
రాహుల్

Rahul gandhi london: లండన్​ పర్యటనలో ఉన్న కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ మరోసారి భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భారత్​లో.. సమస్యలను ఎత్తిచూసే సంస్థలను క్రమంగా అణచివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్లమెంట్​, ఎన్నికల వ్యవస్థ సహా ప్రజాస్వామ్య వ్యవస్థను ఓ సంస్థ తన అధీనంలోకి తెచ్చుకుందని పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్​ విశ్వవిద్యాలయం కార్పస్​ క్రిస్టీ కాలేజ్​లో ఏర్పాటు చేసిన 'ఇండియా ఎట్​ 75' కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు.

"స్వేచ్ఛగా ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నప్పుడే భారత్​ సజీవంగా ఉన్నట్లు.. అదే మౌనంగా ఉంటే ఇంక అందులో అర్థం లేదు. పార్లమెంట్​, ఎన్నికలు, ప్రజాస్వామ్యం మొదలైన వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ విజన్​లో కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు. ఈ వైఖరిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. హిందూ జాతీయవాదం అనే పదాన్ని కూడా అంగీకరించను. దాడులు, హత్యలకు పాల్పడే వారి సిద్ధాంతాలను హిందుత్వంతో పోల్చడం సరికాదు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ నేత

ప్రధాని, ఆర్​ఎస్​ఎస్​లు భారత​ ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు రాహుల్. 'భారత్​లో మీడియాను కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కొంతమంది వ్యాపారవేత్తలు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అందుకే నేను మాట్లాడింది భారత్​లోని ఛానెళ్లలో 30 సెకన్లకు మించి ప్రసారం కాదు. ఇక్కడ పోరాటం కేవలం ఓ రాజకీయ పార్టీపైన కాదు.. ఆ వ్యవస్థ మీద. దీనిపై విజయం సాధించడం అంత సులభం కాదు. జీవితకాలం పట్టొచ్చు. అయినా మేము పోరాడుతాం' అని రాహుల్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి : శృంగారం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.