ETV Bharat / bharat

దొంగకు మస్కా కొట్టిన గజదొంగలు.. ఒకడు చోరీ చేసిన సొమ్ముతో ఇద్దరు పరార్

author img

By

Published : Dec 31, 2022, 10:49 PM IST

ఓ దొంగ చోరీ చేసిన సొమ్మును మరో ఇద్దరు దొంగలు దోచుకెళ్లారు. ఈ విచిత్ర ఘటన గుజరాత్​లో జరిగింది. ఈ సన్నివేశం అంతా సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్​ అయింది.

Another thief stole from thie
దొంగ వద్ద మరో దొంగ చోరి

ఓ దొంగకు మరో ఇద్దరు దొంగలు మస్కా కొట్టారు. ఒకడు చోరి చేసిన సొమ్మును మరో ఇద్దరు గజదొంగలు ఎత్తుకెళ్లారు. గుజరాత్​​లోని సూరత్​లో ఈ ఘటన జరిగింది. ఈ సన్నివేశం అంతా సీసీటీవీలో రికార్డ్​ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింబాయత్‌లోని ప్రతాప్‌నగర్​కు చెందిన నూర్​ జాన్ ముహమ్మద్ షేక్ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో ఈ దొంగతనం జరిగింది. షుగర్‌నగర్ సమీపంలో ఈ కిరాణా దుకాణం ఉంది. మొదట షాపులోకి ప్రవేశించిన ఓ దొంగ.. కొంత సామానును మూటగట్టుకున్నాడు. అనంతరం షాపులో ఉన్న రూ.70వేలను తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు.

thieft-from-another-thief
దొంగ నుంచి సొమ్ము లాక్కుంటున్న మరో ఇద్దరు దొంగలు

అదే సమయంలో షాపు బయటే ఉన్న మరో ఇద్దరు దొంగలు.. చోరీ చేసి ఎత్తుకెళుతున్న రూ.70వేలను మొదటి దొంగ నుంచి లాగేసుకున్నారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైయింది. ఉదయం వచ్చి షాపును చెక్ చేసిన యజమాని.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నట్లు తెలిపారు. తాను బ్యాంకులో డిపాజిట్​ చేయాలనుకున్న సొమ్మును.. దొంగలు చోరీ చేశారని షాపు ఓనర్ వాపోయాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.