ETV Bharat / bharat

ys viveka murder : వైఎస్ వివేకా హత్య కేసులో ఉదయ్​కుమార్ రెడ్డికి రిమాండ్

author img

By

Published : Apr 14, 2023, 7:52 PM IST

Updated : Apr 14, 2023, 9:02 PM IST

వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు
వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు

Gajjala Uday Remand :వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ ఉదయం కడపలో ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు... హైదరాబాద్ తరలించగా.. సీబీఐ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు.

Gajjala Uday Remand : వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు ఉదయ్‌కుమార్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. సీబీఐ అధికారులు ఉదయ్‌కుమార్‌రెడ్డిని ఇవాళ ఉదయం కడపలో అరెస్టు చేయడం విదితమే.

వేగం పెంచిన అధికారులు.. మాజీ మంత్రి.. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యాన సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ అవినాష్​రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన గజ్జెల ఉదయ్​కుమార్​రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అంతకు ముందు.. సీఆర్‌పీసీ 161 కింద నోటీసులు ఇచ్చి ఉదయ్​ స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డు చేశారు. ఉదయ్ కుమార్​ను ఆయన తండ్రి జయప్రకాశ్‌రెడ్డి, అతడి న్యాయవాది సమక్షంలోనే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు మెమో అతడి కుటుంబ సభ్యులకు అప్పగించిన సీబీఐ.. ఉదయ్‌కుమార్‌రెడ్డికి 41ఏ నోటీసు ఇచ్చి అదుపులోకి తీసుకుంది. అనంతరం కడప నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు తరలించి కోర్టులో హాజరుపరిచారు.

సోమవారం విచారణ... ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు... న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణకు హాజరైన తర్వాత కడపలో అరెస్టు చేసిన అనంతరం హైదరాబాద్‌ లోని విజయ్‌నగర్‌కాలనీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా... 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం సీబీఐ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితుడిని కస్టడీకి కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. కస్టడీ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే ఉదయ్‌కుమార్‌రెడ్డి... అవినాష్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. నెల కిందట వరకు సీబీఐ దర్యాప్తు అధికారిగా పనిచేసిన ఎస్పీ రాంకుమార్‌ సింగ్‌ పై ఉదయకుమార్‌రెడ్డి తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంతో... ఇప్పటికీ అరెస్టయిన నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది.

సీబీఐ అధికారిపై కేసు వేసిన ఉదయ్ కుమార్​రెడ్డి.. తుమ్మలపల్లి యురేనియం పరిశ్రమలో పని చేస్తున్న ఉదయ్‌కుమార్‌ రెడ్డి... వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారి, సీబీఐ ఎస్పీ రామ్‌ సింగ్‌పై గతంలో కడప కోర్టులో ప్రైవేటు కేసు వేశాడు. ఉదయ్‌కుమార్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు సీబీఐ ఎస్పీ రామ్‌ సింగ్‌పై గతేడాది కేసు నమోదు చేశారు.

వివేకా హత్య జరిగిన రోజు.. ప్రస్తుత కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డితో పాటు ఉదయ్‌కుమార్‌ రెడ్డి కూడా ఘటనాస్థలానికి వెళ్లాడు. గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా ఉదయ్‌కుమార్‌ రెడ్డి.. భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. వివేకా మృతదేహానికి ఉదయ్‌కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాశ్‌రెడ్డి బ్యాండేజీ కట్టగా.. గతంలోనూ పలుమార్లు ఉదయ్‌కుమార్‌ రెడ్డిని సీబీఐ విచారించింది. హత్య జరిగిన రోజు అంబులెన్స్‌, ఫ్రీజర్‌తో పాటు వైద్యులను కూడా రప్పించడంలో ఉదయ్‌ కుమార్​రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ వెల్లడించింది.

ఇవీ చదవండి :

Last Updated :Apr 14, 2023, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.