ETV Bharat / bharat

టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం- ముగ్గురు మృతి

author img

By

Published : Apr 18, 2021, 5:53 PM IST

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టపాసుల దుకాణంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా.. మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Fire accident in cracker shop
టపాసుల దుకాణంలో మంటలు

తమిళనాడు వెల్లూర్​ జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ టపాసుల దుకాణంలో ఆదివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దుకాణ యజమాని, ఆయన మనమళ్లు ఇద్దరు సజీవ దహనమయ్యారు.

ఈ ప్రమాదంలో దుకాణం మొత్తం కాలిబూడిదైంది. షాప్​ సమీపంలోని 5 ద్విచక్ర వాహనాలకూ మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు అప్రమత్తమై మంటలు విస్తరించకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం.. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: రసాయన కంపెనీలో మంటలు- ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.