ETV Bharat / bharat

Tamilnadu Bus Accident : అదుపుతప్పి లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు.. 9 మంది మృతి.. ఊటీ యాత్రలో విషాదం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 9:52 PM IST

Updated : Oct 1, 2023, 10:41 AM IST

Tamilnadu Bus Accident : ఓ టూరిస్ట్​ బస్సు అదుపుతప్పి లోయలో పడడం వల్ల 9 మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు సహా ఓ మైనర్​ ఉన్నారు. ఈ ఘటన తమిళనాడులోని కూనూర్​ సమీపంలో జరిగింది.

Tamilnadu Bus Accident
లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు

Tamilnadu Bus Accident : ఊటీ విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న ఓ టూరిస్ట్​ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని కూనూర్​ సమీపంలోని మరపాలం వద్ద జరిగింది. మృతుల్లో నలుగురు మహిళలు సహా ఓ మైనర్​ ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 59 మంది ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

  • VIDEO | Eight people dead, more than thirty injured after a tourist bus fell into a gorge in Coonoor area of Tamil Nadu's Nilgiris district.

    CM Stalin has announced an ex-gratia amount of Rs 8 lakh each for the kin of dead and Rs 1 lakh each for seriously injured while Rs 50,000… pic.twitter.com/GtKlRiZimg

    — Press Trust of India (@PTI_News) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. తెంకాసి జిల్లా కడయం ప్రాంతానికి చెందిన పర్యటకులు ఊటీ విహారయాత్రకు వెళ్లారు. పర్యటన ముగించుకుని శనివారం (సెప్టెంబర్ 30) తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం 5.15 గంటల సమయంలో బస్సు కూనూర్​లోని మలపాలం వద్దకు చేరుకోగానే డ్రైవర్​ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ఓ మైనర్​ సహా 9 మంది మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించారు.

ప్రధాని దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. PMNRF నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పును ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఇస్తామన్నారు.

  • Pained by the loss of lives due to a bus accident near Coonoor in Nilgiris district, Tamil Nadu. My thoughts are with the bereaved families. I pray that the injured recover soon. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Those…

    — PMO India (@PMOIndia) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్​గ్రేషియా..
అంతకుముందు ఈ బస్సు ప్రమాదం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్​గ్రేషియా ఇస్తామని చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు పర్యటక శాఖ మంత్రి కే రామచంద్రన్​ను నియమించినట్లు తెలిపారు. మరోవైపు ప్రమాదం గురించి సమచాచారం తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం హైల్ప్​ లైన్​-1077 ను ఏర్పాటు చేసింది.

లోయలో పడి 8 మంది మృతి
ఈ ఏడాది ఆగస్టులో ఉత్తరాఖండ్​ గంగోత్రిలో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గంగోత్రి రహదారిపై గన్​గ్నానీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 35 మంది భక్తులు ఉన్నారు. వీరంతా గుజరాత్​కు చెందిన వారిగా తెలిసింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

లోయలో పడ్డ బస్సు.. స్కూల్ పిల్లలు సహా 12 మంది మృతి.. ప్రధాని విచారం

150 అడుగుల లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు బాలికలు మృతి

Last Updated : Oct 1, 2023, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.