ETV Bharat / bharat

'డెల్టా'లో వరద బీభత్సం- 1.5లక్షల ఎకరాల పంట నాశనం

author img

By

Published : Nov 11, 2021, 5:07 PM IST

Updated : Nov 11, 2021, 10:48 PM IST

tamil nadu weather
వరుణుడి ప్రకోపం.. 'డెల్టా'లో 1.5లక్షల ఎకరాల పంట నాశనం

తమిళనాడు డెల్టా ప్రాంతంలో వర్షాలు(tamil nadu rains) బీభత్సం సృష్టించాయి. దాదాపు 1.5లక్షల ఎకరాల పంట నాశనమైపోయింది. చేతికంది వచ్చిన పంట నీటమునగడం చూసి రైతన్నలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పంట నష్టంపై కమిటీని ఏర్పాటు చేశారు సీఎం.

'డెల్టా'లో వరద బీభత్సం- 1.5లక్షల ఎకరాల పంట నాశనం

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడు(tamil nadu weather) ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ముఖ్యంగా కావేరీ డెల్టా ప్రాంతంలోని జిల్లాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి(tamil nadu rain news live). ఆ ప్రాంతంలో దాదాపు 1.5లక్షల ఎకరాల పంట నాశనమైనట్టు సమాచారం. తిరువారుర్​లో 50వేల ఎకరాలు, కుద్దలూరులో 25వేల ఎకరాలు, నాగపట్టినమ్​లో 30వేల ఎకరాలు, మయిలదుథూరైలో 20వేల ఎకరాలు, తంజావుర్​లో 10వేల ఎకరాల పంటలు నీటమునిగినట్టు విపత్తు నిర్వహణ మంత్రి కేకేఎస్​ఎస్​ఆర్​ రామచంద్రన్​ వెల్లడించారు.

tamil nadu rains
పంట నష్టం.. రైతన్న కన్నీరు

చేతికి అందివచ్చిన పంట నాశనమవ్వడం వల్ల అన్నదాతలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

tamil nadu rains
నీటమునిగిన పంటపొలాలు

పంట నష్టంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​(mk stalin news) ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పరిస్థితులను సమీక్షించి ఈ కమిటీ సీఎంకు నివేదిక అందిస్తుంది.

tamil nadu rains
నీటమునిగిన పంటపొలాలు
tamil nadu rains
ఎటుచూసినా నీరే
tamil nadu rains
నీటమునిగిన పంట

రాష్ట్రంలో ఇదీ పరిస్థితి..

తమిళనాడులో కొన్నిరోజుల నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాల (rains in chennai) కారణంగా చాలా ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 4 రోజుల్లో 91 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాజధాని చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నై సహా చుట్టు పక్కల ఉన్న చెంగల్​పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వాననీరు నిలిచింది. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇళ్లు, ఆస్పత్రుల్లోకి వరద నీరు చేరింది. చెన్నై కేకే నగర్​లోని ఈఎస్​ఐ ఆస్పత్రి జలమయమయింది. రోగుల వార్డుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రోజువారీగా వచ్చే అవుట్ పేషెంట్ వార్డుతో సహా అన్ని విభాగాలు పనిచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్​లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద‌్దని ప్రభుత్వం సూచించింది. వర్షానికి తోడు చెన్నైలో తీవ్రగాలులు వీస్తున్నాయి. దీంతో చెన్నై ఎయిర్​పోర్ట్​ను గురువారం మధ్యాహ్నం తాత్కాలికంగా మూసివేశారు.

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (tamilnadu rain news) బలపడి వాయుగుండంగా మారినట్లు పేర్కొన్న వాతావరణ విభాగం.. గురువారం సాయంత్రం తీరం దాటనున్నట్లు పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అప్రమత్తం చేసింది.

ఇవీ చూడండి:-

Last Updated :Nov 11, 2021, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.