ETV Bharat / bharat

తమిళనాడులో రెడ్​ అలర్ట్​- రెండు రోజుల పాటు సెలవు

author img

By

Published : Nov 9, 2021, 8:22 PM IST

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న తమిళనాడు రాష్ట్రాన్ని మరో రెండు రోజులు వర్షాలు ముంచెత్తనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం.

tamil nadu
తమిళనాడు వర్షాలు

భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. 'రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని' ఐఎండీ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 11 వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని.. ఇప్పటికే వెళ్లినవారు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించింది.

వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండురోజుల పాటు సెలవులను ప్రకటించింది. విపత్తును ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చింది.

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు.

ఇవీ చదవండి:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.