ETV Bharat / bharat

రూ.16 కోట్ల రుణం చెల్లించమని స్వీపర్​కు నోటీసులు.. బ్యాంక్ అకౌంట్​ కూడా లేదట!

author img

By

Published : Apr 23, 2023, 4:45 PM IST

Updated : Apr 23, 2023, 7:55 PM IST

స్వీపర్​గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి రూ.16 కోట్ల రుణం చెల్లించమని ఓ బ్యాంక్​ నోటీసులు జారీ చేసింది. మార్చి 4 లోపు మొత్తాన్ని చెల్లించాలని నోటీసులో పేర్కొంది. దీంతో ఆ వ్యక్తి బిత్తరపోయాడు. తనకు ఆ బ్యాంక్​ అసలు ఖాతానే లేదని చెబుతున్నాడు. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది.

sweeper-get-notice-from-bank-rs-16-cr-for-loan-pending-in-gujarath
రూ 16 కోట్లు చెల్లించమని స్వీపర్​ బ్యాంక్​ నోటీసు

సాధారణ జీవనం గడిపే ఓ స్వీపర్​కు రూ.16 కోట్ల రుణం చెల్లించమని ఓ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసులు ఇచ్చిన బ్యాంక్​లో తనకు ఖాతానే లేదని ఆ స్వీపర్​ చెబుతున్నాడు. బ్యాంక్​ అధికారులు పంపిన ఈ నోటీసుతో.. స్వీపర్​ కుటుంబం అవ్వాకైంది. అతని భార్య భయంతో అనారోగ్యం పాలై.. ఆసుపత్రిలో చేరింది. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది.

వడోదర నగరానికి చెందిన శాంతిలాల్ అనే వ్యక్తి తన భార్య జాషిబెన్‌తో కలిసి రాజ్యలక్ష్మి సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఉత్తర్​ ప్రదేశ్​ ఆగ్రాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్​ శాఖకు మీరు అప్పు ఉన్నారని, మార్చి 4వ తేది లోపు వాటిని చెల్లించాలని నోటీసులు పంపించారు అధికారులు. లోన్​ చెల్లించనట్లయితే.. ఆస్తులను స్వాధీనం చేసుకుంటామనే హెచ్చరిక సైతం అందులో ఉంది. దీంతో శాంతిలాల్​ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అతని భార్య సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.

అనంతరం శాంతిలాల్​ కుటుంబం వడోదర నగర కార్యాలయానికి వెళ్లి.. పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయినా ఎటుంటి లాభం లేకపోయింది. అధికారులు శాంతిలాల్​కు ఎటువంటి సమాచారం అందించలేదు. అనంతరం శాంతిలాల్​.. స్థానిక ఎమ్మెల్యే నీరజ్​ చోప్రాను ఆశ్రయించారు. ఎమ్మెల్యే చోప్రా బాధితుల తరఫున జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. వారికి న్యాయం చేయాలని అధికారులను కోరారు.

శాంతిలాల్​ కుటుంబం మొత్తం ఆస్తులే రూ.5 నుంచి 10 లక్షలు ఉంటాయన్న నీరజ్​ చోప్రా.. అలాంటి వారు రూ. 16 కోట్లు ఎలా అప్పు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఇదొక ఫేక్​ నోటీసని అన్నారు. దీని వల్ల శాంతిలాల్​ కుటుంబం ఆసుపత్రి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీస్​పై విచారణ జరిపించాలని అధికారులను డిమాండ్​ చేశారు. "నేను ఒక స్వీపర్​ని. నాకు పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​లో ఎటువంటి ఖాతా లేదు. నేను ఎక్కడా లోన్​ కూడా తీసుకోలేదు. నాకు కేవలం బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో మాత్రమే ఖాతా ఉంది." అని శాంతిలాల్​ తెలిపారు.

మూడేళ్లి క్రితం మరణించిన వ్యక్తికి లోన్​
మూడేళ్ల క్రితం మరణించిన వ్యక్తికి లోన్ మంజూరు చేశారు బ్యాంక్ అధికారులు. తాజాగా లోన్​ తిరిగి చెల్లించడం లేదంటూ మృతుడి కుటుంబ సభ్యులకు నోటీసులు అందించారు. అయితే, తమకు బ్యాంక్​ నుంచి ఎలాంటి రుణం అందలేదని మృతుడి కుమారుడు వాపోతున్నాడు. మధ్యప్రదేశ్​ ఛింద్​వాఢలో వింత ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి : భింద్రన్‌వాలే స్వగ్రామంలోనే అమృత్​పాల్​ అరెస్ట్.. పోలీసులు పట్టుకున్నారా?.. లొంగిపోయాడా?

కర్ణాటక ఎన్నికలు.. 502 మంది అభ్యర్థుల నామినేషన్​లు రిజెక్ట్.. పోటీలో ఎంతమందంటే?

Last Updated : Apr 23, 2023, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.