ETV Bharat / bharat

లాక్​డౌన్​పై యూపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట!

author img

By

Published : Apr 20, 2021, 1:59 PM IST

Supreme Court
సుప్రీంకోర్టు

ఉత్తర్​ప్రదేశ్​లో లాక్‌డౌన్ అంశంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టేలో ఉంచింది సుప్రీంకోర్టు. కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్​ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

ఉత్తర్​ప్రదేశ్​లో ఐదు ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ విధించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ నగరాల్లో ఏప్రిల్​ 26 వరకు కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్​ జనరల్ తుషార్​ మెహతా.. ప్రభుత్వం ఇప్పటికే కరోనా నిబంధనలను అమలు చేస్తోందని ధర్మాసనానికి విన్నవించారు. న్యాయస్థాన ఆదేశాలతో లాక్​డౌన్​ విధించమనడం సరైన విధానం కాదని తెలిపారు. లాక్‌డౌన్ విధిస్తే పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని వెల్లడించారు.

ఈ విషయంలో సీనియర్​ న్యాయవాది పీ.ఎస్​ నరసింహను అమికస్​ క్యూరీగా నియమిస్తూ.. కేసును మరో రెండు వారాలకు వాయిదా వేసింది.

కరోనా దృష్ట్యా ఐదు ప్రధాన నగరాలైన లఖ్‌నవూ, ప్రయాగ్‌రాజ్, వారణాసి, కాన్పుర్, గోరఖ్‌పుర్‌లో ఈ నెల 26వరకు లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు సోమవారం ఆదేశించింది. తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

వారాంతపు లాక్​డౌన్​: కరోనా వ్యాప్తి దృష్ట్యా ఉత్తర్​ప్రదేశ్‌లో వారాంతపు లాక్‌డౌన్‌ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. శని, ఆదివారాల్లో ఈ మేరకు కఠిన ఆంక్షలు ఉండనున్నట్లు పేర్కొంది.

శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. అయితే ఉత్తర్​ప్రదేశ్‌లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది.

ఇదీ చదవండి: ప్రధాని.. పోర్చుగల్, ఫ్రాన్స్​ పర్యటనలు రద్దు!

ఇదీ చదవండి: 'కరోనా నియంత్రణకు సైన్యం సేవలు విస్తరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.