ETV Bharat / bharat

అంబులెన్స్​కు డబ్బులేక భర్త మృతి.. అలా ఎవరికీ కాకూడదని ఆమె ఏం చేసిందంటే?

author img

By

Published : Dec 30, 2022, 12:27 PM IST

చనిపోయిన తన భర్త జ్ఞాపకార్థంగా తక్కువ ధరకే అంబులెన్స్​ సేవలను అందిస్తోంది ఓ మహిళ. ఇలా ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తూ అనేక మంది మనసుల్లో చోటు సంపాదించుకుంది. మరి ఆమె విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

Subsidized ambulance sevice for the needy: Gujarat woman's unique tribute to her late husband
సబ్సీడీ ధరలో అంబులెన్స్ సేవలు అందిస్తున్న సంగీతాబెన్ షా

ప్రియమైన వారు చనిపోతే వారి జ్ఞాపకార్థంగా పేద ప్రజలకు భోజనాలు పెట్టడం, బహుమతులను ఇవ్వటం లాంటి సంఘటనలు చాలానే చూశాం. అయితే గుజరాత్ రాజ్​కోట్​కు చెందిన సంగీతాబెన్ షా అనే మహిళ మాత్రం చనిపోయిన తన భర్తకు నివాళులను అర్పించేందుకు ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. పేద ప్రజలకు రాయితీ అంబులెన్స్​ సేవలను అందించాలనే నిర్ణయం తీసుకుంది.

ఏడాదిన్నర క్రితం సంగీతాబెన్ భర్త హరేష్‌భాయ్ మన్సుఖ్లాల్ షా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ఆమెకు అంబులెన్స్ చెల్లించడానికి డబ్బులు కూడా లేవు. ఈ కారణంగా సంగీతాబెన్ తన భర్తను ఆస్పత్రికి ఆలస్యంగా తీసుకెళ్లడం వల్ల ఆమె భర్త మరణించాడు. దీంతో అప్పటి నుంచి పేద ప్రజలకు సబ్సిడీ అంబులెన్స్​ సేవలను అందించాలని నిశ్చయించుకుంది. రాజ్​కోట్ నివాసి అయిన సంగీతాబెన్​ షా ముంబయికి చెందిన ఆల్ఫా ఫౌండేషన్​ సభ్యురాలు. గుజరాత్ రాష్ట్రంలో క్లిష్టపరిస్థితుల్లో ఉన్న రోగులకు అర్జెంట్​గా అంబులెన్స్ సేవ అవసరమైనప్పుడు.. ఆమె అధిక రాయితీతో వారికి ఆ సేవలను అందిస్తోంది. ఈ విధంగా పేద ప్రజల జీవితాలను రక్షించేందుకు ఆమె కృషి చేస్తోంది.

Subsidized ambulance sevice for the needy: Gujarat woman's unique tribute to her late husband
సబ్సీడీ ధరలో అంబులెన్స్ సేవలు అందిస్తున్న సంగీతాబెన్ షా

"ఏడాదిన్నర క్రితం చనిపోయిన నా భర్త హరేష్‌భాయ్ మన్సుఖ్లాల్ షా జ్ఞాపకార్థంగా ఈ అంబులెన్స్ సేవలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ సేవల ద్వారా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న రోగులను చికిత్స నిమిత్తం నేపాల్​కు కూడా తీసుకెళ్లగలిగాం. గుజరాత్​లోని రాజ్​కోట్​, మోర్బీ, అహ్మదాబాద్​ల నుంచి కూడా ఈ అంబులెన్స్ సేవలను అందిస్తున్నాం"

- సంగీతాబెన్ షా , అంబులెన్స్​ నిర్వాహకురాలు

సంగీతాబెన్ షా నిస్వార్థమైన కృషి వల్ల లబ్ధిపొందిన అనేక మందిలో జర్నా శర్మ కుటుంబం ఒకటి. ఇటీవల జర్నా కుటుంబం వ్యాపార పనుల కోసం నేపాల్​ నుంచి వచ్చారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చి అస్వస్థతకు గురైంది. దీంతో హుటాహుటిన రాజ్​కోట్​ సివిల్ హాస్పిటల్‌కు తరలించి.. చికిత్స అందించిన్నప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తదుపరి చికిత్స కోసం నేపాల్​కు తిరిగి తీసుకుని వెళ్లాలనుకున్నారు. అయితే నేపాల్​కు అంబులెన్స్ ఛార్జీలు తమ తాహతకు మించి ఉన్నాయి. దీంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో వారు సంగీతాబెన్​ షా అందించే సేవల గురించి తెలుసుకున్నారు. ఆమె సహాయంతో జర్నాను నేపాల్​ ఆసుపత్రికి తీసుకెళ్లగలిగారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.