ETV Bharat / bharat

'ట్రీ హౌస్'లో ఆన్​లైన్​ క్లాసులు.. నెట్​వర్క్​ సమస్యలకు చెక్​

author img

By

Published : Feb 12, 2022, 7:07 PM IST

Students Build Tree House: నెట్​వర్క్​ సమస్యల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది విద్యార్థులు ఆన్​లైన్ క్లాసులకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్​కు చెందిన విద్యార్థులు ఈ సమస్యకు వినూత్న పరిష్కారం చూపారు. చెట్టుపైనే ఇంటిని నిర్మించారు. వీరికి స్థానికంగా ఉండే ఓ కళాకారుడు సాయపడ్డారు.

students-build-tree-house
విద్యార్థులు నిర్మించిన 'ట్రీ హౌస్'

విద్యార్థులు నిర్మించిన 'ట్రీ హౌస్'

Students Build Tree House: కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్​లైన్ క్లాసులు తప్పనిసరి అయ్యాయి. అయితే నెట్​వర్క్ సమస్యతో గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది విద్యార్థులు డిజిటల్​ తరగతులకు దూరమవుతున్నారు. కానీ జమ్ముకశ్మీర్​లోని మాంతా గ్రామానికి చెందిన విద్యార్థులు.. సిగ్నల్ సమస్యలను నిందించకుండా వినూత్నంగా ఆలోచించారు.

సిగ్నల్ కోసం చెట్టుపైనే ఇంటిని నిర్మించారు. ఇప్పుడు గ్రామంలోని విద్యార్థులంతా ఈ ట్రీ హౌస్​లో ప్రశాంతంగా చదువుకుంటున్నారు.

సత్యేశ్వర్​​సింగ్ అనే ఓ కళాకారుడు వీరికి సహకారం అందించారు. ఈ ఇంటి నిర్మాణానికి వెదురు బొంగులను వినియోగించారు. ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకునేలా ట్రీహౌస్​ను నిర్మించినట్లు సత్యేశ్వర్ తెలిపారు.

"గ్రామంలో కొన్ని ప్రాంతాల్లోనే ఇంటర్నెట్ బాగా వస్తోంది. వాటిల్లో ఈ ప్రాంతం ఒకటి. పిల్లలు వారి సమస్యలను చెప్పడం వల్ల ఇ ఇంటిని నిర్మించాలన్న ఆలోచన వచ్చింది."

-- సత్యేశ్వర్​ సింగ్, కళాకారుడు

"నా పేరు విక్కీసింగ్. నేను 12వ తరగతి చదువుతున్నాను. ఇంటర్నెట్ సమస్య కారణంగా చదువుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ సిగ్నల్ బాగా వస్తుంది. ఇక్కడే కూర్చుని చదువుకుంటున్నాం."

-- విక్కీ సింగ్, 12వ తరగతి విద్యార్థి

ఇంట్లో అసౌకర్యంగా ఉండటం, గ్రామంలో నెట్​వర్క్ సమస్యలతో ఇబ్బందులు పడగా.. ఈ ట్రీహౌస్​లోనే ఇప్పుడు చదువుకుంటున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: పైనుంచి రైలు.. ట్రాక్​ మధ్యలో నక్కి బాలికను కాపాడిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.