ETV Bharat / bharat

పుల్వామా ఘటనపై అనుచిత వ్యాఖ్యలు.. విద్యార్థికి ఐదేళ్ల జైలు శిక్ష

author img

By

Published : Nov 1, 2022, 2:00 PM IST

Student gets 5-year jail term for celebrating Pulwama attack
Student gets 5-year jail term for celebrating Pulwama attack

2019లో జరిగిన పుల్వామా దాడి గురించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఇంజినీరింగ్​ విద్యార్థికి కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 2019 పుల్వామా దాడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడికి న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
కర్ణాటక కచారక్నహళ్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఫైజ్ రషీద్.. 2019లో పాకిస్థానీ ఉగ్రమూకలు చేసిన పుల్వామా దాడిని ఉద్దేశించి ఫేస్​బుక్​లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సామాజిక మాధ్యమాల్లో పలు న్యూస్​ ఛానళ్లు చేసిన పోస్టుల​కు వివాదాస్పద కామెంట్లు పెట్టాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అప్పుడే అరెస్టు చేశారు. రషీద్​ ఫోన్​ స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపించారు. అప్పటి నుంచి నిందితుడు రిమాండ్​లోనే ఉన్నాడు. బెయిల్ పిటిషన్​ను కోర్టు పలు మార్లు తిరస్కరించింది.​
ఎట్టకేలకు రషీద్ కేసులో తీర్పు వెలువడింది. న్యాయస్థానం అతడికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించింది.

ఇదీ చదవండి: 'చాక్లెట్​ చోరీ' వీడియో వైరల్.. అవమానభారంతో యువతి ఆత్మహత్య

గడియారాల సంస్థకు మోర్బీ బ్రిడ్జి​ మరమ్మతు బాధ్యతా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.