ప్రిన్సిపల్​పై స్టూడెంట్​ రివెంజ్​.. గన్​తో కాల్పులు జరిపి..

author img

By

Published : Sep 24, 2022, 9:13 PM IST

student fired on principal

ప్రిన్సిపల్​ మందలించాడని ఓ విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఉత్తర్​ప్రదేశ్​లోని సీతాపుర్​లో దారుణం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్​పై ఓ విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ ఘటన జహంగీరాబాద్​లోని సదర్​పుర్ పోలీస్​స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
అసలేం జరిగిందంటే.. జహంగీరాబాద్​లోని ఆదర్శ్ రామస్వరూప్ విద్యాలయ ఇంటర్మీడియట్​ కాలేజీలో 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య శుక్రవారం గొడవ జరిగింది. అందులో ఓ విద్యార్థి మరో విద్యార్థిపై దాడి చేశాడు. ఈ విషయం కళాశాల ప్రిన్సిపల్ రామ్​ సింగ్ వర్మ దృష్టికి చేరింది. దీంతో ప్రిన్సిపల్​.. ఓ విద్యార్థిని మందలించాడు. ఈ క్రమంలో ప్రిన్సిపల్​పై కోపం పెంచుకున్న స్టూడెంట్​ శనివారం.. కాలేజీకి వచ్చేటప్పుడు తన వెంట తుపాకీ తెచ్చుకుని కాల్పులు జరిపాడు.

ఈ దాడిలో ప్రిన్సిపల్ తల, కడుపు, నడుము భాగంలో బుల్లెట్​ గాయాలయ్యాయి. వెంటనే నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సదర్​పుర్ పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని ప్రిన్సిపల్​ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అతడి కుటుంబసభ్యులు రామ్​సింగ్​ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడం వల్ల వైద్యులు సూచన మేరకు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి: తప్పిపోయిన తల్లికి అంత్యక్రియలు.. మరుసటి రోజే ఇంటికి వచ్చిన 'ఆమె'ను చూసి!

మోకాల్లోతు నీరు.. స్కూల్​ బస్సులో చెలరేగిన మంటలు.. విద్యార్థులంతా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.