ETV Bharat / bharat

'ఇక నుంచి డ్రైవింగ్​ టెస్ట్​ మరింత కఠినం'

author img

By

Published : Mar 25, 2021, 10:44 PM IST

nitin gadkari on driving test, stringent tests in driving
'లైసెన్స్​ కావాలంటే కఠినమైన పరీక్షలు తప్పనిసరి'

డ్రైవింగ్​ లైసెన్స్​ పొందాలంటే కఠినమైన నైపుణ్య పరీక్షల్లో ఉత్తీర్ణులు అవడం తప్పనిసరి అని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ స్పష్టం చేశారు. సమర్థమంతమైన డ్రైవర్లుగా తీర్చిదిద్దేందుకే ఈ తరహా కఠినమైన పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గురువారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాల్లో ఈ విధంగా పేర్కొన్నారు.

డ్రైవింగ్​ లైసెన్స్​ పొందాలనుకుంటే ఇక నుంచి కఠినమైన నైపుణ్య పరీక్షల్లో ఉత్తీర్ణులు అవడం తప్పనిసరి అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ స్కిల్​ టెస్టులలో భాగంగా అధికారులు సూచించిన విధంగా వాహనం రివర్స్​ చేయడం వంటివి చేయాలని పేర్కొన్నారు. డ్రైవింగ్​ టెస్ట్​లో ఉత్తీర్ణులు అవ్వాలంటే పాస్​ పర్సెంటేజ్​ 69 శాతం దాటి ఉండాలని తెలిపారు. గురువారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాల్లో ఈ విధంగా పేర్కొన్నారు.

"ఆర్టీఓల్లో పాస్​ పర్సెంటేజ్​ 69 శాతంగా కొనసాగుతుంది. సమర్థమంతమైన డ్రైవర్లుగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా కఠినమైన పరీక్షలు నిర్వహిస్తున్నాము. డ్రైవింగ్​ టెస్ట్​ కన్నా ముందు ఇందుకు సంబంధించి అవగాహన కోసం ఎల్​ఈడీ స్క్రీన్​పైన ప్రదర్శన నిర్వహిస్తారు. లైసెన్స్​, రిజిట్రేషన్లకు సంబంధించిన సేవలను ప్రజలకు సులభతరం అయ్యేలా వాటిని ఆన్​లైన్​ చేశాము."

-నితిన్​ గడ్కరీ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి

వాహనాల రిజిస్ట్రేషన్​ ప్రక్రియకు డీలర్లే పూర్తిగా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : పర్యటకులను ఆకర్షిస్తోన్న 'తులిప్​' అందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.