ETV Bharat / bharat

'నా హెలికాప్టర్​కు అనుమతివ్వలేదు..​ భాజపా కుట్రే'

author img

By

Published : Jan 28, 2022, 5:23 PM IST

SP chief Akhilesh Yadav: తన హెలికాప్టర్​ టెకాఫ్​ అయ్యేందుకు అనుమతించలేదని, దిల్లీలోనే చిక్కుకుపోయానని ట్వీట్​ చేశారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. ముజఫర్​నగర్ ఎన్నికల కార్యక్రమానికి​ వెళ్లేందుకు అనుమతించకపోవటం భాజపా ఉద్దేశపూర్వక కుట్రేనని ఆరోపించారు.

SP chief Akhilesh Yadav
అఖిలేశ్​ యాదవ్

SP chief Akhilesh Yadav: ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో ఎన్నికల కార్యక్రమానికి వెళ్లేందుకు తన హెలికాప్టర్​ను అనుమతించకపోవటం వల్ల దిల్లీలోనే చిక్కుకుపోయానని ఆరోపించారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. ఈ మేరకు హెలికాప్టర్​తో ఉన్న ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేశారు. అయితే, అందుకు గల కారణాలను వివరించలేదు.

  • मेरे हैलिकॉप्टर को अभी भी बिना किसी कारण बताए दिल्ली में रोककर रखा गया है और मुज़फ़्फ़रनगर नहीं जाने दिया जा रहा है। जबकि भाजपा के एक शीर्ष नेता अभी यहाँ से उड़े हैं। हारती हुई भाजपा की ये हताशा भरी साज़िश है।

    जनता सब समझ रही है… pic.twitter.com/PFxawi0kFD

    — Akhilesh Yadav (@yadavakhilesh) January 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" ఎలాంటి కారణాలు చెప్పకుండానే నా హెలికాప్టర్​ను నిర్బంధించారు. ఇక్కడి నుంచే ఓ భాజపా అగ్రనేత వెళ్లినప్పటికీ.. నేను ముజఫర్​నగర్​ వెళ్లేందుకు అనుమతించటం లేదు. ఇది భాజపా ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రే."

- అఖిలేశ్​ యాదవ్​, ఎస్​పీ అధినేత.

అర్ధగంట తర్వాత మరో ట్వీట్​ ద్వారా భాజపాపై విమర్శలు గుప్పించారు అఖిలేశ్​. 'అధికార దుర్వినియోగం వారి ఓటమిని సూచిస్తోంది. సామాజిక ఉద్యమ చరిత్రలో ఈ రోజు కూడా చేరుతుంది. చరిత్రను మార్చే చారిత్రక పోరాటాన్ని చేయబోతున్నాం.' అని పేర్కొన్నారు.

అఖిలేశ్​ యాదవ్​, ఆర్​ఎల్​డీ అధినేత జయంత్​ చౌధరిలు ముజఫర్​నగర్​లోని పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: ఎస్పీకి ములాయం కుటుంబ సభ్యుల గుడ్​బై- అఖిలేశ్​కే లాభమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.