ETV Bharat / bharat

తల్లి చనిపోయినా.. తండ్రి కోసం తనయుడి ఆరాటం!

author img

By

Published : May 5, 2021, 2:02 PM IST

Updated : May 5, 2021, 2:33 PM IST

ఓ వైపు తల్లి మరణం. మరోవైపు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రి. ఆ పరిస్థితుల్లో ధైర్యం కోల్పోని ఓ వ్యక్తి.. ఆరోగ్యం క్షీణించిన తన తండ్రిని కాపాడుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.

covid death
కరోనా, తల్లి మృతి

కరోనా సోకిన తల్లిదండ్రులకు ఇంట్లోనే చికిత్స

కర్ణాటకలో కరోనా ఉద్ధృతికి ఈ దృశ్యాలు అద్దంపడుతున్నాయి. తన తల్లిదండ్రులను కాపాడుకోవడం కోసం.. ఓ కొడుకు పడే ఆరాటం సగటు మనిషిని కదిలిస్తున్నాయి.

ఇంట్లోని ఒక గదిలో కళ్ల ముందే తల్లి మృతదేహాన్ని పెట్టుకుని.. మరో గదిలో చావుబతుకుల మధ్య ఉన్న తండ్రినైనా కాపాడుకునేందుకు ఆ యువకుడు చేస్తున్న ప్రయత్నం హృదయవిదారకమనే చెప్పుకోవాలి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

ఇదీ జరిగింది..

బెంగళూరు బీటీఎమ్ లేఅవుట్​లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన తల్లి తండ్రులను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. కొవిడ్​ సోకిన ఆయన తల్లితండ్రులకు.. ఆసుపత్రిలో పడక, ఆక్సిజన్ దొరకలేదని ఏకంగా ఇంటినే ఆస్పత్రిగా మార్చేశాడు.

ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్​ అమర్చి.. వైద్య సేవలు చేశాడు. అయితే.. ఆక్సిజన్​ సిలిండర్ ఉన్నప్పటికీ సరైన రీతిలో వైద్యం అందక తల్లి మరణించింది..

అప్పటికే తండ్రి ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో తండ్రినైనా కాపాడుకోవాలని ఆ యువకుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.

ఇవీ చదవండి:

కరోనా భయం.. మృతదేహాన్ని పట్టించుకోని వైనం

ఊపిరాడట్లేదు.. వాష్‌ రూంకు కూడా వెళ్లలేకపోతున్నాం!

Last Updated : May 5, 2021, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.