ETV Bharat / bharat

నడిరోడ్డుపైనే తల్లిదండ్రులను నరికేసిన కుమారుడు.. ఎందుకంటే?

author img

By

Published : Apr 10, 2022, 12:35 PM IST

Updated : Apr 10, 2022, 8:15 PM IST

Son Killed Parents
Son Killed Parents

Son Killed Parents: కేరళలోని త్రిస్సూర్​లో దారుణం జరిగింది. తల్లిదండ్రులను నడిరోడ్డు మీదే కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Son Killed Parents: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి.. తన తల్లిదండ్రులనే కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కేరళలోని త్రిస్సూర్​లో వెలుగుచూసింది. ఆదివారం ఉదయం సుమారు పది గంటల సమయంలో తల్లిదండ్రులు రోడ్డు సమీపంలో పనిచేసుకుంటూ ఉండగా వచ్చిన నిందితుడు.. కత్తితో నరికి చంపేశాడు. అనంతరం తాను హత్య చేసినట్లు పోలీసులు సమాచారం అందించి అక్కడి నుంచి పరారయ్యాడు.

Son Killed Parents
రోడ్డు మీద పడి ఉన్న మృతదేహాలు

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అనీశ్​ (30) సహా మృతులు కుట్టన్​ (60), చంద్రిక (55) ఇన్చాకుండ్​ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్​ చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : యూపీలో ఘోరం.. ఏడేళ్ల బాలికపై హిజ్రా అత్యాచారం

Last Updated :Apr 10, 2022, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.