ETV Bharat / bharat

Shiv Sena Disqualification Hearing : 'ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం ఎప్పుడు?'.. స్పీకర్​కు సుప్రీంకోర్ట్ లాస్ట్​ ఛాన్స్​

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 5:33 PM IST

Shiv Sena Disqualification Hearing
Shiv Sena Disqualification Hearing

Shiv Sena Disqualification Hearing : శివసేన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి తెలపాలంటూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పకర్​కు చివరి అవకాశం ఇచ్చింది సుప్రీం కోర్టు. దసరా సెలవుల్లో సొలిసిటర్​ జనరల్​.. స్పీకర్​తో చర్చిస్తారని తెలిపారని పేర్కొంది.

Shiv Sena Disqualification Hearing : మహారాష్ట్రలో శివసేనకు చెందిన రెండు వర్గాల (శిందే, ఉద్ధవ్) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. తన వద్దనున్న ఈ అనర్హత పటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి చెప్పాలంటూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్​కు చివరి అవకాశాన్నిచ్చింది. ఈ పిటిషన్లపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే టైమ్ షెడ్యూల్​తో తాము సంతృప్తి చెందలేదని ప్రధాన న్యామూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దసరా సెలవుల సమయంలో తాను వ్యక్తిగతంగా స్పీకర్​తో చర్చిస్తానని సొలిసిటర్​ జనరల్​ చెప్పారని తెలిపింది. ఈ విషయంపై తదుపరి విచారణ అక్టోబర్​ 30కి వాయిదా వేసింది.

'ఆ విషయం తెలుసుకోవాలి'
తన వద్ద పెండింగ్​లోని అనర్హత పటిషన్లపై మంగళవారం మహారాష్ట్ర స్పీకర్ రాహుల్​ నర్వేకర్ స్పందించారు. ఏ నిర్ణయం రాగ్యాంగ విరుద్ధం అవుతుందో అనే విషయాన్ని తాను తెలుసుకోవాలని చెప్పారు. త్వరలోనే తన నిర్ణయాన్ని సుప్రీం కోర్టుకు సమర్పిస్తానన్నారు. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, సుప్రీం కోర్టులో విచారణ ముగిసిన తర్వాతే ఈ అంశంలో స్పష్టత వస్తుందని అన్నారు.

స్పీకర్​పై సుప్రీం ఆగ్రహం..
Shiv Sena Dispute Supreme Court : అంతకుముందు ఈ విషయంపై శుక్రవారం (అక్టోబర్ 13) విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్​ నర్వేకర్​పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వచ్చిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ జాప్యం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను స్పీకర్ బేఖాతరు చేయలేరని స్పష్టం చేసింది.

ధర్మాసనం హెచ్చరిక..
ఈ వ్యవహారాన్ని ఎప్పటిలోగా తేలుస్తారో కాల వ్యవధి చెప్పాలని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ తెలిపారు. లేకపోతే మొత్తం ప్రక్రియే అసంపూర్ణమవుతుందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్పీకర్ ఇచ్చే కాల వ్యవధి తమను సంతృప్తి పరచని పక్షంలో రెండు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని తామే ఆదేశిస్తామని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది.
అంతకుముందు ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే, ఇతర శివసేన (శిందే వర్గం) ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో కాలవ్యవధిని చెప్పాలంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 18న ఆదేశించింది.

శిందేపై వేటు.. సీఎంగా పవార్.. బీజేపీ కొత్త స్కెచ్ ఇదేనా?

'శివసేన బాలాసాహెబ్'​గా శిందే వర్గం.. రెబల్​ ఎమ్మెల్యేలపై ఠాక్రే చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.