ETV Bharat / bharat

నేతాజీ జయంతి కార్యక్రమాలకు షా నేతృత్వంలో కమిటీ

author img

By

Published : Dec 22, 2020, 5:04 AM IST

Shah to head committee for planning year-long commemoration of Netaji's 125th birth anniversary
నేతాజీ జయంతి కార్యక్రమాలకు షా నేతృత్వంలో కమిటీ!

నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ 125వ జయంతిని పురస్కరించుకొని ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జరగనున్న కార్యక్రమాలకు ఈ కమిటీ మార్గదర్శకాలు జారీ చేస్తుంది.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్​ చంద్రబోస్​ 125వ జయంతిని పురస్కరించుకొని ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తుంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కమిటీలో సభ్యులు

ఈ ఉన్నత స్థాయి కమిటీలో నిపుణులు, చరిత్రకారులు, రచయితలు, నేతాజీ కుటుంబ సభ్యులు, ఆజాద్ హింద్​ ఫౌజ్‌తో సంబంధం ఉన్న ప్రముఖ వ్యక్తులు ఉంటారు. దిల్లీ, కోల్​కత్తా సహా నేతాజీకి సంబంధమున్న ఇతర ప్రాంతాల్లో స్మారకోత్సవ కార్యక్రమాలకు ఈ కమిటీ మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ కమిటీ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు.

"నేతాజీ ధైర్య సాహాసాలు గురించి అందరికీ తెలుసు. ఆయన పండితుడు, సైనికుడు, రాజనీతిజ్ఞుడు. బోస్​ 125వ జయంతి వేడుకలను త్వరలో ప్రారంభించబోతున్నాం. దాని కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాం. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అందరూ కలిసి ఘనంగా నిర్వహించాలి."

- ప్రధాని నరేంద్ర మోదీ

భారత స్వాతంత్య్ర సంగ్రామానికి నేతాజీ చేసిన విశేష కృషికి నివాళిగా, కృతజ్ఞతకు చిహ్నంగా స్మారకోత్సవం నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి: 'వైద్య వృత్తి ఎంతో గొప్పది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.