ETV Bharat / bharat

లోయలో పడ్డ ట్యాక్సీ.. తొమ్మిది మంది దుర్మరణం

author img

By

Published : May 26, 2022, 9:46 AM IST

Updated : May 26, 2022, 10:32 AM IST

Zojila Pass road accident
Zojila Pass road accident

Zojila Pass road accident: శ్రీనగర్​ నుంచి కార్గిల్​కు వెళ్తున్న ట్యాక్సీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు సహా తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

Zojila Pass road accident: జమ్ముకశ్మీర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్గిల్​ నుంచి శ్రీనగర్​ ప్రయాణిస్తున్న ఓ ట్యాక్సీ అదుపుతప్పి 1200 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు సహా తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం శ్రీనగర్​- లేహ్​ జాతీయ రహదారిపై జోజిలా పాస్​ వద్ద బుధవారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Zojila Pass road accident
లోయలో పడ్డ ట్యాక్సీ

ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. ఉదయం మరో రెండు మృతదేహాలను వెలికితీసినట్లు ఎస్​హెచ్​ఓ యూనిస్​ బషీర్​ తెలిపారు. వీరిలో నలుగురు గుజరాత్​, ఇద్దరు జమ్ముకశ్మీర్​, ఇద్దరు పంజాబ్​, ఒకరు యూపీ రాష్ట్రాలకు చెందిన వారని గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఝార్ఖండ్​ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా కార్గిల్​-శ్రీనగర్ మార్గంలో ఉదయం 6 గంటల తర్వాత ప్రయాణించేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ ఈ ట్యాక్సీ నిబంధనలు ఉల్లంఘించి వెళ్లింది.

ఇదీ చదవండి: కల్తీ మద్యం కలకలం.. నాలుగురోజుల్లోనే 17 మంది మృతి!

Last Updated :May 26, 2022, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.