ETV Bharat / bharat

ఆ హైకోర్టులకు 19 మంది కొత్త న్యాయమూర్తులు!

author img

By

Published : Feb 3, 2022, 5:08 AM IST

SC Collegium: దేశంలో పలు హైకోర్టులకు నూతన న్యాయమూర్తుల నియామకానికి 19 మంది పేర్లు కేంద్రానికి సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. వీరిలో 12 మంది జడ్జీలను తెలంగాణ, ఆరుగురిని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా, మరొకరిని పట్నా హైకోర్టు జడ్జిగా ప్రతిపాదించింది.

supreme court
సుప్రీంకోర్టు

SC Collegium: దేశంలోని పలు హైకోర్టులకు న్యాయమూర్తులుగా 19 మంది అడ్వకేట్లు, న్యాయ అధికారుల పేర్లను సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. మరో 8 మంది పేర్లను మరోసారి ప్రతిపాదించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ నేతృత్వంలోని కొలిజియంలో జస్టిస్ యూయూ లలిత్, ఏఎం కన్వీల్కర్ సభ్యులుగా ఉన్నారు.

కొలీజియం 19 మంది పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరిలో 12 మంది జడ్జీలను తెలంగాణ, ఆరుగురిని దిల్లీ హైకోర్టు జడ్జీలుగా, ఒకరిని పట్నా హైకోర్టు జడ్జిగా ప్రతిపాదించింది. ఈనెల 1వ తేదీన సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి : 'ఇండియా ఒకటి కాదు రెండు- వాటి మధ్య అంతరాయం పెరుగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.