లఖింపుర్ హింసపై విచారణ.. యూపీ సర్కారుపై సుప్రీం అసహనం!

author img

By

Published : Oct 20, 2021, 12:51 PM IST

Lakhimpur Kheri incident sc

లఖింపుర్ ఖేరి (Lakhimpur Kheri case) ఘటనలో సాక్షులందరి వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 44 మంది సాక్షుల్లో నలుగురి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్ ఖేరి (Lakhimpur Kheri case) ఘటనపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన హరీశ్ సాల్వే వాదనలు ఆలకించింది. ఈ కేసులోని 44 మంది సాక్షుల్లో నలుగురి వాంగ్మూలాన్ని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసినట్లు సాల్వే తెలిపారు. సంబంధిత స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్​లో అందించినట్లు సాల్వే పేర్కొన్నారు. (Lakhimpur Kheri news)

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి. రమణ.. నివేదిక ఇప్పుడే తమకు అందిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మంగళవారం రాత్రి వరకు నివేదిక కోసం ఎదురుచూశారని చెప్పారు. మిగితా సాక్షుల స్టేట్​మెంట్లను సైతం రికార్డు చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. (Supreme Court Lakhimpur Kheri)

అంతకుముందు, విచారణను (Supreme Court Lakhimpur Kheri hearing) శుక్రవారానికి వాయిదా వేయాలన్న సాల్వే అభ్యర్థనను సుప్రీం న్యాయమూర్తులు తోసిపుచ్చారు. (Supreme Court Lakhimpur case) ఈ సందర్భంగా యూపీ సర్కారుపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారాన్ని త్వరగా ముగించాలని స్పష్టం చేసింది.

న్యాయవాదుల లేఖ

లఖింపుర్ ఉదంతంపై (Lakhimpur Kheri case) ఉన్నతస్థాయి న్యాయ విచారణ చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకుమార్‌ త్రిపాఠి, సీఎస్‌ పాండా అనే న్యాయవాదులు సీజేఐకి లేఖలు రాశారు. వీరి అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ నెల 8వ తేదీని విచారణ జరిపింది.

ఆ సందర్భంగా లఖింపుర్‌ హింసకు (Lakhimpur Kheri violence) కారణమైన నిందితుల పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. 'దయచేసి విచారణకు హాజరుకండి' అంటూ నిందితుడికి సీఆర్‌పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మండిపడింది. మిగతా కేసుల్లో నిందితుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? అని నిలదీసింది. యూపీ సర్కారు నుంచి మాటలే తప్ప చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదీ జరిగింది..

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ.. అక్టోబర్​ 3న లఖింపుర్‌ ఖేరిలో (Lakhimpur Kheri Incident) ఆందోళన చేస్తున్న రైతులపైకి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారు, మరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు చనిపోవడం.. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో ఆశిష్‌ మిశ్ర సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: లఖింపుర్​ ఘటనకు నిరసనగా.. రైతుల 'రైల్​ రోకో'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.