ETV Bharat / bharat

ఎర్రకోట ఉగ్రదాడి దోషికి ఉరే సరి... సుప్రీం కోర్టు ఫైనల్​ డెసిషన్​..!

author img

By

Published : Nov 3, 2022, 12:31 PM IST

2000 ఎర్రకోట ఉగ్రదాడి కేసులో తనకు విధించిన మరణశిక్ష తీర్పును పునఃసమీక్షించాలంటూ ఆరిఫ్​ దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టిపారేసింది సుప్రీం. అతడికి మరణ శిక్షే సరైనది అంటూ తీర్పును ఇచ్చింది.

2000 Red Fort attack case
2000 Red Fort attack case

2000 Red Fort attack case: 2000 ఎర్రకోట ఉగ్ర దాడి కేసులోని దోషికి మరణ శిక్షే సరైనదంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. మరణశిక్ష తీర్పును పునఃసమీక్షించాలంటూ నిందితుడు చేసుకున్న అభ్యర్థనను గురువారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం పిటీషన్​ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న అభ్యర్థనను అంగీకరించినట్లు చీఫ్ జస్టిస్ యూయూలలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

"ఎలక్ట్రానిక్ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న అభ్యర్థను మేము అంగీకరించాము. అతని నేరం రుజువైంది. కోర్టు తీసుకున్న అభిప్రాయాన్ని మేము ధృవీకరించి రివ్యూ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాము" అని ధర్మాసనం పేర్కొంది. అయితే ఆ దాడుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లతో పాటు ముగ్గురిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల్లో ఆరిఫ్​ ఒకడు. కాల్పులు జరిగిన మూడు రోజుల తర్వాత ఆరిఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2005 అక్టోబర్ 24న, ట్రయల్ కోర్టు అతడిని దోషిగా నిర్ధరించి.. అక్టోబర్ 31న మరణశిక్ష విధించింది. దీంతో అతడు మరణశిక్ష తీర్పును పునఃసమీక్షించాలని ఉన్నత న్యాయస్థానాల్లో పిటీషన్​లు దాఖలు చేస్తూ వచ్చాడు. అలా 2007లో దిల్లీ హైకోర్టు, 2011లోనూ రెండు సార్లు సుప్రీం కోర్టు అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. అయినా అతడు మళ్లీ రివ్యూ పిటీషన్​ను దాఖలు చేయగా.. తాజాగా దానిని కూడా కొట్టి పారేసింది సుప్రీం. మరణ శిక్షే సరైనది అని తీర్పును వెలువరించింది.

ఇదీ చదవండి: తండ్రి డ్రగ్స్​ బానిస.. స్టేషన్​లో పిల్లలు.. పసికందుకు పాలిచ్చిన పోలీస్ అమ్మ

ఆరు రాష్ట్రాల్లో జోరుగా ఉపఎన్నికల పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.