ETV Bharat / bharat

కేరళలో ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త దారుణ హత్య

author img

By

Published : Feb 25, 2021, 9:19 AM IST

RSS worker killed in clash in Kerala's Alappuzha
ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త దారుణ హత్య

కేరళలోని అలప్పుజలో ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఇస్లామిస్ట్​తో సంబంధాలున్న పాపులర్​ ఫ్రంట్​ వ్యక్తులే ఈ హత్య చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్​ ఆరోపించారు. ఈ హత్యకు నిరసనగా అలప్పుజలో భాజపా, హిందూసంస్థలు 12 గంటల బందుకు పిలుపునిచ్చాయి.

కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​( ఆర్ఎస్​ఎస్​) కార్యకర్తను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు. మృతుడు వయలార్​కు చెందిన రాహుల్​ కృష్ణ అలియాస్ నందుగా పోలీసులు గుర్తించారు.

అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి చెర్తలకు సమీపంలోని నాగమ్​కులనగర్​లో ది సోషల్​ డెమొక్రటిక్​ పార్టీ ఆఫ్​ ఇండియా(ఎస్​డీపీఐ), ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాహుల్​ కృష్ణ అలియాస్​ నందు అనే ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త మృతి చెందాడని, ముగ్గురు ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలతో పాటు, ఆరుగురు ఎస్​డీపీఐ కార్యకర్తలు గాయపడ్డారని వెల్లడించారు.

ఇస్లామిస్ట్​​ అవుట్​ఫిట్​ పాపులర్​ ఫ్రంట్​(పీఎఫ్​ఐ)కు ఎస్​డీపీఐ అనుబంధ శాఖ. కాగా ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తను హత్య చేసింది పాపులర్​ ఫ్రంట్​ కార్యకర్తలేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్​ ఆరోపించారు.

ఆర్ఎస్​ఎస్​ కార్యకర్త మృతికి నిరసనగా భాజపాతో పాటు హిందూ సంస్థలు అలప్పుజలో 12 గంటల పాటు బందుకు పిలుపునిచ్చాయి.

ఇదీ చూడండి: శబరిమల నిరసనకారులపై కేసులు వెనక్కి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.