ETV Bharat / bharat

ప్రముఖుల ప్రసంగాలతో 'పాజిటివిటీ అన్​లిమిటెడ్'​

author img

By

Published : May 11, 2021, 6:58 AM IST

rss
ప్రముఖుల ప్రసంగాలతో 'పాజిటివిటీ అన్​లిమిటెడ్'​

ప్రజల్లో స్థైర్యం పెంచేందుకు ఆర్​ఎస్​ఎస్​ 'పాజిటివిటీ అన్​లిమిటెడ్'​ పేరుతో మంగళవారం నుంచి వివిధ కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో పలువురు ప్రముఖులు భాగం కానున్నారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో సాధారణ ప్రజల్లో స్థైర్యం పెంచేందుకు 'పాజిటివిటీ అన్​లిమిటెడ్'​ పేరుతో ఆర్​ఎస్​ఎస్​మంగళవారం నుంచి వివిధ కార్యక్రమాలను చేపట్టనుంది. తొలి రోజున ఆర్​ఎస్​ఎస్​ అధినేత మోహన్​ భాగవత్​ ఆన్​లైన్​లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

విప్రో ఛైర్మన్​, అజీం ప్రేమ్​జీ, ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్​ సుధామూర్తి, సద్గురు జగ్గీవాసుదేవ్​, శ్రీశ్రీ రవిశంకర్​, నిర్మల్​ సంత్​ అఖాడాకు చెందిన జ్ఞాన్​దేవీజీ, జైనముని ప్రాణనాథ్​లు, సందేశాలు ఇస్తారు. ఈ ప్రసంగాలు ఫేస్​బుక్​, యూట్యూబ్​లతో పాటు.. వివిధ న్యూస్​ పోర్టల్స్​లో కూడా ప్రసారమవుతాయి.

ఇదీ చూడండి: టిక్రీ సరిహద్దులో అత్యాచారం- సిట్​ ఏర్పాటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.