ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

author img

By

Published : Mar 16, 2022, 1:32 AM IST

Updated : Mar 16, 2022, 6:57 AM IST

Road Accident: ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

road accident
రోడ్డు ప్రమాదం

Road Accident: ట్రక్కు - ట్రాక్టర్​ ఢీ కొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్​గఢ్​లోని గరియాబంద్​ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది.

Road Accident
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులు

ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Road Accident
ఆస్పత్రి వద్ద స్థానికులు

నష్ట పరిహారం

గరియాబంద్​ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి భూపేశ్​​ బఘేల్​ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇస్తామని.. గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో బాధితులకు మెరుగైన చికిత్సను అందిస్తామని స్పష్టం చేశారు.

Road Accident
క్షతగాత్రులను తరలిస్తున్న పోలీసులు

ఇదీ చూడండి : అశ్వమే వాహనం.. పెట్రోల్ ధరలు భరించలేక గుర్రంపైనే..

Last Updated :Mar 16, 2022, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.