ETV Bharat / bharat

ఒడిశా మంత్రుల మూకుమ్మడి రాజీనామా.. సీఎం ఆదేశాలతోనే!

author img

By

Published : Jun 4, 2022, 3:19 PM IST

Updated : Jun 4, 2022, 5:05 PM IST

Odisha CM News
మంత్రులంతా రాజీనామా చేయాలని సీఎం ఆదేశం

Odisha News: ఒడిశా మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. స్పీకర్​ కూడా తన పదవి నుంచి తప్పుకొంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గం ఆదివారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనుంది.

Odisha CM News: ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి వర్గాన్ని సమూలంగా మార్చాలని సంకల్పించారు. అందులో భాగంగానే మంత్రులంతా రాజీనామాలు చేయాలని ఆదేశించారు. దీంతో శనివారం మంత్రులంతా తమ రాజీనామాలను గవర్నర్​కు సమర్పించారు. స్పీకర్​ సూర్యనారాయణ పాత్రో కూడా పదవి నుంచి తప్పుకొన్నారు. అయితే తక్షణమే రాజీనామా చేయాలని సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించడం వల్లే వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 11:45 గంటలకు కొత్తమంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనునన్నట్లు సమాచారం. అయితే మంత్రులకు శాఖల కేటాయింపు విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. సూర్యనారాయణకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే నవీన్ పట్నాయక్​ మంత్రివర్గాన్ని మార్చుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక జూన్​ 20న ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రోమ్​, దుబాయ్​ను సందర్శించనున్నారు. జూన్ 22న శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటనకు ముందే మంత్రివర్గాన్ని మార్చాలని సీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం మే 29తో మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి రావడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం.

ఇదీ చదవండి: తాగుబోతు కోడి.. మందు లేనిదే ముద్ద ముట్టదట!

Last Updated :Jun 4, 2022, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.