ETV Bharat / bharat

'వచ్చే ఏడాది రిపబ్లిక్​ డే పరేడ్​.. సెంట్రల్​ విస్టా అవెన్యూలోనే'

author img

By

Published : Sep 16, 2021, 4:48 PM IST

మరో రెండున్నర నెలల్లో సెంట్రల్​ విస్టా అవెన్యూ (central vista avenue) అందుబాటులోకి వస్తుందన్నారు కేంద్ర మంత్రి హర్దీప్​ సింగ్​ పురీ. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం పరేడ్ (Republic day​) నిర్వహించేందుకు అవెన్యూ సిద్ధంగా ఉంటుందన్నారు.

central vista
సెంట్రల్​ విస్టా హర్దీప్​ సింగ్

సెంట్రల్​ విస్టా అవెన్యూ (central vista avenue) మరో రెండున్నర నెలల్లో పూర్తి అవుతుందని కేంద్ర మంత్రి హర్దీప్​​ సింగ్​ పురీ వెల్లడించారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం (Republic day​) నాటికి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటుందని (central vista avenue) తెలిపారు. 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త పార్లెమెంటు భవనంలోనే జరుగుతాయని పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ మార్గ్​, ఆఫ్రికా అవెన్యూ ప్రాంతంలో రక్షణ కార్యాలయ సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

12 నెలల్లోనే పూర్తి..

రక్షణ కార్యాలయ సముదాయ నిర్మాణం శరవేగంగా పూర్తయిందన్నారు హర్దీప్​​ సింగ్​ పురీ. లైట్​గేజ్​ స్టీల్​ ఫ్రెమింగ్​ టెక్నాలజీతో ఈ భవనాలను నిర్మించారని పేర్కొన్నారు. 24 నెలలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు కేవలం 12 నెలల్లో పూర్తయిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6.4 లక్షల మందికి ఉపాధి కలిగిందన్నారు.

ఇదీ చూడండి : Kanhaiya kumar congress: యూపీ ఎన్నికల వేళ కాంగ్రెస్​లోకి కన్నయ్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.