ETV Bharat / bharat

'చైనా ఆక్రమణకు పాల్పడిందనే నిజాన్ని అంగీకరించాలి'

author img

By

Published : Nov 20, 2021, 5:25 PM IST

Rahul Gandhi
రాహుల్​ గాంధీ

భారత్​-చైనా సరిహద్దు వివాదాన్ని ఉద్దేశిస్తూ మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. చైనా ఆక్రమణలకు పాల్పడిందనే నిజాన్ని ఒప్పుకోవాలని ట్విట్టర్​ వేదికగా డిమాండ్​ చేశారు.

కేంద్రంపై మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనే సత్యాన్ని అంగీకరించాలని డిమాండ్​ చేశారు. రైతులకు క్షమాపణలు చెబుతూ.. అత్యంత వివాదాస్పదమైన మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మరుసటి రోజునే.. రాహుల్​ ఈమేరకు ట్వీట్​ చేశారు.

  • अब चीनी क़ब्ज़े का सत्य भी मान लेना चाहिए।

    — Rahul Gandhi (@RahulGandhi) November 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నిర్వహణలో మోదీ సర్కారు విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్.. దేశ​ ప్రాదేశిక సమగ్రతకు రాజీపడిందని ఆరోపించింది. లద్దాఖ్​ ప్రతిష్టంభన తర్వాత వాస్తవాదీన రేఖ వెంబడి పరిస్థితులపై అసలు నిజాలు చెప్పాలని డిమాండ్​ చేస్తోంది.

లద్దాఖ్​ సరిహద్దులో సున్నితమైన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై ఇప్పటివరకు 13 సార్లు చర్చలు జరిగినా.. ఎలాంటి పురోగతి సాధించలేదు. అయితే 14వ విడత చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.

గతేడాది మే 5న భారత్​-చైనా బలగాల మధ్య తూర్పు లద్దాఖ్​ ప్రాంతంలో ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం ఇరుపక్షాలు క్రమంగా తమ బలగాల మోహరింపును పెంచాయి. ప్రస్తుతం సరిహద్దుకు ఇరువైపుల 50 నుంచి 60 వేల మంది చొప్పున సైనికులను మోహరించాయి.

ఇదీ చూడండి: అజయ్​ మిశ్రా హాజరయ్యే సమావేశానికి మోదీ రావొద్దు: ప్రియాంక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.