ETV Bharat / bharat

పంజాబ్​లో ఎన్​డీఏ సీట్ల పంపకం పూర్తి.. కెప్టెన్​ పార్టీకి 37 స్థానాలు

author img

By

Published : Jan 24, 2022, 5:22 PM IST

Updated : Jan 24, 2022, 6:26 PM IST

Punjab seat sharing
పంజాబ్​ ఎన్​డీఏ కూటమి పార్టీలతో అమిత్​ షా భేటీ

Punjab assembly polls 2022: పంజాబ్​ శాసనసభ ఎన్నికల్లో పీఎల్​సీ, ఎస్​ఏడీ(ఎస్​)తో కలిసి బరిలో నిలుస్తున్న భాజపా.. సీట్ల పంపకాన్ని పూర్తి చేసింది. ఈ సందర్భంగా పంజాబ్​కు డబుల్​ ఇంజిన్ ప్రభుత్వం అవసరమన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మరోవైపు.. నవజ్యోత్​ సింగ్​ సిద్ధూపై విమర్శలు గుప్పించారు కెప్టెన్​ అమరీందర్​ సింగ్​.

Punjab assembly polls 2022: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కూటమిలో సీట్ల పంపకాన్ని పూర్తి చేసింది భాజపా. ఈ ఎన్నికల్లో 65 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ పార్టీ పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​కు 37, శిరోమణి అకాలీ దళ్​(సంయుక్త్​)కు 15 సీట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు.

పంజాబ్​లోని ఎన్​డీఏ భాగస్వామ్యపక్షాల నేతలతో దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు నడ్డా. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, కెప్టెన్​ అమరీందర్​ సింగ్​, సర్దార్​ సుఖ్​దేవ్​ సింగ్​ దిండ్సా హాజరయ్యారు.

Punjab seat sharing
దిల్లీలో ఎన్​డీఏ కూటమి పార్టీలతో అమిత్​ షా భేటీ

" ప్రస్తుతం పంజాబ్​పై ప్రత్యేక దృష్టి అవసరం. అందుకు డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వం కావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సహకారం అవసరం. సీట్ల పంపకంపై కుదిరిన ఒప్పందాన్ని తెలియజేస్తున్నా. భాజపా 65, పీఎల్​సీ 37, ఎస్​ఏడీ 15 సీట్లలో పోటీ చేయనున్నాయి. "

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు.

నవజ్యోత్​ సింగ్​ సిద్ధూపై కెప్టెన్​ విమర్శలు..

ఈ సందర్భంగా మాట్లాడిన కెప్టెన్​ అమరీందర్​ సింగ్​.. దేశ భద్రత, రాష్ట్ర సంక్షేమం కోసమే మూడు పార్టీలు కలిశాయన్నారు. పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​కు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ స్నేహితుడని, అందుకే తన ప్రభుత్వంలో సిద్ధూను తిరిగి మంత్రిగా తీసుకోవాలని ఆ దేశం నుంచి తనకు సందేశం అందినట్లు గుర్తు చేసుకున్నారు​.

" నా ప్రభుత్వం నుంచి సిద్ధూను తొలగించిన తర్వాత.. పాకిస్థాన్​ ప్రధానికి ఆయన పాత స్నేహితుడని ఆ దేశం నుంచి నాకు ఒక సందేశం వచ్చింది. తన ప్రభుత్వంలోకి తిరిగి తీసుకుంటే కృతజ్ఞతతో ఉంటారని.. ఒకవేళ సరైన పనితీరు కనబరచకపోతే అప్పుడు తొలగించాలని అందులో ఉంది."

- కెప్టెన్​ అమరీందర్​ సింగ్​, పీఎల్​సీ పార్టీ అధినేత.

పంజాబ్​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గం నుంచి సిద్ధూను తొలిగించారు కెప్టెన్​. ఆ తర్వాత పంజాబ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడిగా సిద్ధూను నియమించటాన్నీ వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: పంజాబ్​లో ఎవరి బలం ఎంత? అమరీందర్ మేజిక్ చేసేనా?​

మాల్వా చిక్కితే పంజాబ్‌ దక్కినట్లే.. అన్ని పార్టీల గురి అక్కడే..!

Last Updated :Jan 24, 2022, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.