ETV Bharat / bharat

నడిరోడ్డులో యువకుడిపై కాల్పులు.. పోలీస్​ సస్పెండ్​.. ఏం జరిగింది?

author img

By

Published : Jun 28, 2022, 11:38 AM IST

Updated : Jun 28, 2022, 11:55 AM IST

punjab-asi-shoots-youth-in-t
punjab-asi-shoots-youth-in-t

పంజాబ్​లో నడ్డిరోడ్డుపై అర్ధరాత్రి ఓ పోలీసు అధికారి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో స్థానిక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు.. కాల్పులకు తెగబడ్డ పోలీస్ అధికారిపై చర్యలు చేపట్టారు. అసలేం జరిగిందంటే?

పంజాబ్​లోని డేరా బస్సీ ప్రాంతంలో నడిరోడ్డుపై సోమవారం అర్ధరాత్రి పోలీసు కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది. రోడ్డు మీద నిల్చున్న కొందరితో పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసు అధికారి ఓ యువకుడిపై కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్​ గాయం తగిలి.. బాధితుడు రోడ్డు మీద విలవిలలాడాడు.

అసలేం జరిగిందంటే.. డేరా బస్సీ ప్రాంతంలోని సోమవారం రాత్రి ఓ కుటుంబం వేరే ప్రదేశానికి వెళ్లడానికి రోడ్డుపైకి వచ్చి నిల్చున్నారు. అదే సమయంలో రోడ్డుపై పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు.. వారి దగ్గరకు వెళ్లి తనిఖీ కోసం బ్యాగులు ఓపెన్​ చేయమన్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వారిలో హితేశ్​ అనే యువకుడిపై కాల్పుడు జరిపాడు సబ్​ఇన్​స్పెక్టర్​. బుల్లెట్ అతడి తొడలో దూసుకెళ్లి తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడు ప్రస్తుతం ఛండీగఢ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

punjab-asi-shoots-youth-in-t
ఆసుపత్రిలో బాధితుడు

అయితే బ్యాగులు ఓపెన్​ చేయమన్నందుకు యువకుడితో పాటు అతడి బంధువులు తమపై దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. యూనిఫామ్​ను చింపడానకి ప్రయత్నించారని, అందుకే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే బాధితులు మాత్రం ఇది ఉద్దేశపూర్వక దాడి అని ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఘటనను కొందరు స్థానికులు ఫోన్లలో చిత్రీకరించారు. ఆపై సోషల్​మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి వైరల్​గా మారాయి.

punjab-asi-shoots-youth-in-t
ధ్వంసమైన పోలీస్​ జీప్​

"26 ఏళ్ల యువకుడి కాల్పులు జరిపిన డేరా బస్సీ సబ్​ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశాం. మాకు ఇప్పటి వరకు ఆ ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఫిర్యాదు అందిన తర్వాత విచారణ మొదలుపెడతాం" అని మొహలీ ఎస్పీ వివేక్ షీల్ సోనీ తెలిపారు.

'పౌరులను మనుషులుగా చూడడం మానేశారు'.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పంజాబ్​ భాజపా నేత తేజేందర్​ పాల్​ సింగ్​ బగ్గా ట్విట్టర్​లో షేర్​ చేశారు. పంజాబ్​లో ఆప్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పోలీసులు.. సాధారణ పౌరులను మనుషుల్లా చూడడం మానేశారని ఆరోపించారు. తన ట్వీట్​లో ఆప్​ కన్వీనర్​, దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ను బగ్గా ట్యాగ్​ చేశారు.​

ఇవీ చదవండి: వెల్లివిరిసిన మతసామరస్యం.. పండిట్ల వివాహానికి ముస్లింలే పెళ్లి పెద్దలు

హైవేపై ట్రక్కు-కారు ఢీ.. ఐదుగురు దుర్మరణం

Last Updated :Jun 28, 2022, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.