ETV Bharat / bharat

'మోదీజీ.. దేశమంతా టీకా ఉచితంగా ఇవ్వండి'

author img

By

Published : Jan 9, 2021, 5:31 PM IST

Provide COVID-19 vaccine free to everyone: Kejriwal appeals to Centre
మోదీజీ.. కరోనా టీకాను ఉచితంగా ఇవ్వండి: కేజ్రీ

దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాను సరఫరా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​. అయితే.. దిల్లీ ప్రజలకు ఉచిత టీకా సరఫరా చేస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించారు.

కొవిడ్​-19 వ్యాక్సిన్​ను దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్..​ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​ వేదికగా విజ్ఞప్తి చేశారు.

Arvind Kejriwal tweet
అరవింద్​ కేజ్రీవాల్​ ట్వీట్​

"కరోనా వైరస్ ఈ శతాబ్దపు అతిపెద్ద మహమ్మారి. దాని నుంచి దేశ ప్రజలను కాపాడటం చాలా ముఖ్యం. కాబట్టి, ప్రతి ఒక్కరికీ ఉచితంగానే టీకా అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. వ్యాక్సిన్​ పంపిణీకి కేంద్రమే ఖర్చు చేయడం వల్ల.. ఎంతో మంది ప్రాణాలు నిలుస్తాయి."

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

అయితే.. కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి రాగానే తమ ప్రజలందరికీ ఉచితంగానే సరఫరా చేస్తామని దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

ఇదీ చదవండి: మోదీ అధ్యక్షతన నేతాజీ​ 125వ జయంతి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.