ETV Bharat / bharat

మాస్టార్​ను చెప్పుతో కొట్టిన మహిళా ప్రిన్సిపల్.. ఏమైందంటే?

author img

By

Published : Mar 15, 2022, 9:49 AM IST

Errant womaprincipal of Ballia school
సహోద్యోగిని చెప్పుతో కొట్టిన లేడి ప్రిన్సిపల్

Principal Slaps Male Teacher: ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్​, టీచర్​ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మహిళా ప్రిన్సిపల్.. ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టిన మహిళా ప్రిన్సిపల్

Principal Slaps Male Teacher: ఉత్తర్​ప్రదేశ్​ బలియా జిల్లా సావన్​లో షాకింగ్ ఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాలలో పనిచేసే మహిళా ప్రిన్సిపల్, టీచర్​కు మధ్య వాగ్వాదం.. భౌతిక దాడులకు దారితీసింది. ఆగ్రహానికి లోనైన మహిళా ప్రిన్సిపల్.. ఆ ఉపాధ్యాయుడిపై చేయిచేసుకున్నారు. ఆయనను చెప్పుతో కొట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

principal slaps male teacher
టీచర్, ప్రిన్సిపల్ వాగ్వాదం

ఏం జరిగిందంటే?

సావన్​లోని ప్రభుత్వ పాఠశాలలో మార్చి 9న ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో స్కూల్ ప్రిన్సిపల్ రంజనా పాండే పాల్గొన్నారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న టీచర్​ మానవేంద్ర్ మైకులో మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా మైకు లాగేసుకున్నారు రంజనా పాండే. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ప్రిన్సిపల్​.. మానవేంద్ర్​పై చేయిచేసుకున్నారు. ఆయన్ను చెప్పుతో కొట్టారు. వెంటనే అప్రమత్తమైన అక్కడివారు.. వాళ్లిద్దరినీ పక్కకు తీసుకెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వ్యవహారాన్ని సీరియస్​గా తీసుకున్న ఉన్నతాధికారులు ఇరువురినీ సస్పెండ్ చేసి.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: కబడ్డీ ఆటగాడిని కాల్చిచంపిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.