ETV Bharat / bharat

'మోదీపై దాడికి ఉగ్రకుట్ర'.. దేశవ్యాప్తంగా NIA సోదాలు.. పీఎఫ్ఐ కార్యకర్తలే టార్గెట్

author img

By

Published : May 31, 2023, 10:00 AM IST

Updated : May 31, 2023, 11:24 AM IST

Prime Minister Modi case.. NIA raids at 25 places in karnataka kerala bihar states
'మోదీపై దాడికి ఉగ్రకుట్ర'.. దేశవ్యాప్తంగా NIA సోదాలు.. పీఎఫ్ఐ కార్యకర్తలే టార్గెట్

NIA Raids : అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. కర్ణాటక, కేరళ, బిహార్‌లోని దాదాపు 25 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం దాడులు నిర్వహించింది.

NIA Raids Kerala :నిషేధిత ఇస్లామిక్​ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకర్తలే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా ఆకస్మిక సోదాలు చేపట్టింది. 2022లో బిహార్​లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడికి యత్నించిన కేసు సహా ఇతర కేసులకు సంబంధించి కర్ణాటక, కేరళ, బిహార్‌లోని దాదాపు 25 ప్రాంతాల్లో బుధవారం దాడులు నిర్వహించింది.

NIA Raids Dhakshina Kannada : బుధవారం ఉదయం నుంచే.. దక్షిణ కన్నడ జిల్లాలో సోదాలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 16 ప్రదేశాల్లో పీఎఫ్ఐ కార్యకర్తలకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, ఆస్పత్రులపై దాడులు చేస్తున్నట్లు వెల్లడించాయి. మంగళూరు, పుత్తూరు, బెల్తాంగడి, ఉప్పినాంగడి, వెనూర్​ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన పలు డిజిటల్‌ డాక్యుమెంట్లను ఎన్‌ఐఏ అధికారులకు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

NIA Raids Today :
ఇదివరకే ఈ కేసులో బంట్వాళ్​, పుత్తూరులో ఎన్​ఐఏ సోదాలు జరిపింది. నిందితులుగా ఉన్న మహ్మద్ సినాన్, సర్ఫరాజ్ నవాజ్, ఇక్బాల్, అబ్దుల్ రఫీక్‌లను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన మరో వ్యక్తిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు.

PFI NIA Arrest : పట్నా​లో కూడా గతేడాది జూలై 12న పీఎఫ్​ఐపై నమోదైన కేసులో ఆరుగురిని అరెస్టు చేసిన ఎన్​ఐఏ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4-5 తేదీల్లో బిహార్‌ మోతిహరిలోని ఉగ్రసంస్థకు సంబంధించిన ఎనిమిది ప్రదేశాల్లో దర్యాప్తు బృందం దాడులు చేసింది. ఈ క్రమంలో పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేసింది.

NIA Raids Bihar : కాగా, కొద్ది రోజుల క్రితం పీఎఫ్​ఐ శిక్షకుడు యాకుబ్..​ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ఫేస్​బుక్​లో ఓ వీడియోను పోస్ట్​ చేశారు. దీన్ని చూసిన కొందరు నెటిజన్లు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న యాకుబ్​ ప్రస్తుతం పరారీలో ఉండగా ఇద్దరిని అరెస్ట్​ చేసింది ఎన్​ఐఏ. మిగతావారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

What Is PFI Case : గల్ఫ్ దేశాల నుంచి హవాలా సొమ్మును తరలించి ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్న ఆరోపణలపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. దక్షిణ భారతదేశంలోని పీఎఫ్‌ఐ హవాలా మనీ నెట్‌వర్క్​.. దేశంలో ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తోంది. ఫుల్వారీషరీఫ్​ సహా ఇతర కేసులకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు బృందం ఈ సోదాలు చేస్తోంది.

Last Updated :May 31, 2023, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.