ETV Bharat / bharat

'ధరల పెంపుతో కేంద్రం దాడి.. ప్రజలపై రూ.1.25 లక్షల కోట్ల భారం'

author img

By

Published : Apr 3, 2022, 11:44 AM IST

Price Rise: దేశంలో ధరల పెరుగుదలతో ప్రజల జీవనోపాధి అతిపెద్ద సవాలుగా మారిందని కాంగ్రెస్​ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. 'ఎన్నికల్లో గెలుపు.. దోపిడీకి లైసెన్స్'లాగా మారిందని ఆరోపించారు.

Price Rise in India
రణదీప్ సూర్జేవాలా

Price Rise in India: దేశంలో ధరల పెరుగుదలపై కాంగ్రెస్ మండిపడింది. కేంద్రం ఈ ఏడాదిలోనే రూ.1.25 లక్షల కోట్ల అదనపు పన్నుల భారం మోపిందని ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. పెరుగుతున్న ధరలతో ప్రజల జీవనోపాధి అతిపెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు. 'ఎన్నికల్లో గెలుపు దోపిడీకి లైసెన్స్'లాగా మారిందని ఆరోపించారు. ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.

"ధరల పెరుగుదల ప్రతి ఇంటి బడ్జెట్​ను చిన్నాభిన్నం చేస్తోంది. సామాన్యుడి జీవనోపాధిపై ప్రభావం పడుతోంది. పెట్రోల్ రేట్లు ప్రతి రోజు గుడ్​మార్నింగ్ బహుమతిలా మారింది. గత 12 రోజుల్లో 10సార్లు పెరిగాయి."
-రణదీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి

డీఏపీ ధర బస్తాకు రూ.150 చొప్పున పెంచడం ద్వారా 62 కోట్ల మంది రైతులపై ప్రభుత్వం పన్ను విధిస్తోంది. 50 కేజీల డీఏపీ బస్తాకు రూ.1200 నుంచి రూ.1350కి పెంచడం ద్వారా రూ.3600 కోట్ల ఆదాయం కేంద్రానికి సమకూరుతోంది. కేంద్రం అన్నదాతపై ప్రతీకారం తీర్చుకుంటోంది

ఇదీ చదవండి: 'భారత్-నేపాల్ స్నేహం ప్రత్యేకం.. ప్రపంచంలో ఎక్కడా లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.