ETV Bharat / bharat

నామినేషన్​ ఉపసంహరణ గడువు పూర్తి.. రాష్ట్రపతి రేసులో ఇక ఇద్దరే!

author img

By

Published : Jul 2, 2022, 9:49 PM IST

ద్రౌపదీ
ద్రౌపదీ

President election 2022: రాష్ట్రపతి ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు రిటర్నింగ్​ అధికారి పీసీ మోదీ. నామినేషన్​ ఉపసంహరణ గడువు ముగిసిందని.. రేసులో ద్రౌపదీ ముర్ము, యశ్వంత్​ సిన్హాలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈనెల 18న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్​ జరగనున్నట్లు వెల్లడించారు.

President election 2022: రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్​ ఉపసంహరణ గడువు ముగిసింది. 94 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్​ సిన్హాలు మాత్రమే ప్రస్తుతం రేసులో ఉన్నారు. దాఖలైన 115 నామినేషన్​లలో 107 పత్రాలను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి, రిటర్నింగ్​ ఆఫీసర్ పీసీ మోదీ తిరస్కరించారు. నిబంధనలకు తగినట్టు లేకపోవడమే అందుకు కారణం.

రాష్ట్రపతి అభ్యర్థులు ముర్ము, సిన్హా ఇద్దరూ చెరో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారని.. వాళ్ల నామినేషన్​ను ఇప్పటికే ఆమోదించామని పీసీ మోదీ తెలిపారు. జులై 18న ఓటింగ్​ను పార్లమెంట్​లోని 63 నెంబరు గదిలో నిర్వహిస్తామని.. రాష్ట్ర అసెంబ్లీలలో నిర్దేశించిన రూముల్లో జరుపుతామని వెల్లడించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓటింగ్​ సాగుతుందని పేర్కొన్నారు.

జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహిస్తారు. 21న కౌంటింగ్​ చేపట్టనున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఇదీ చూడండి : స్కూల్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వేతనం రూ.2లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.