ETV Bharat / bharat

కాంగ్రెస్, భాజపా వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ

author img

By

Published : Sep 25, 2021, 10:59 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్, భాజపా వర్గాల మధ్య ఘర్షణ (BJP Congress News) జరిగింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ అనుచరులు తనపై దాడి చేశారని భాజపా ఎంపీ సంగమ్ లాల్ గుప్తా ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. కఠిన చర్యలకు ఆదేశించారు.

uttar pradesh mp sangam lal gupta
యూపీలో కాంగ్రెస్, భాజపా వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ

ఘర్షణ దృశ్యాలు

ఉత్తర్​ప్రదేశ్ ప్రతాప్​గఢ్ జిల్లాలో భాజపా, కాంగ్రెస్ శ్రేణుల (BJP Congress News) మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రమోద్ తివారీ (Pramod Tiwari news) వర్గీయులు తనతో పాటు తన అనుచరులపై దాడి చేశారని భాజపా ప్రతాప్​గఢ్ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా (Sangam Lal Gupta news) ఆరోపించారు. సంగిపుర్ తాలుకాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. తన చొక్కా సైతం చించేశారని గుప్తా ఆరోపించారు.

uttar pradesh mp sangam lal gupta
చిరిగిన చొక్కాతో ఎంపీ సంగమ్ లాల్ గుప్తా

"నేను నా కార్యకర్తలు సంగీపుర్​లోని మేళాకు వెళ్లాం. అక్కడ కాంగ్రెస్ మాజీ ఎంపీ తివారీ డయాస్​పై కూర్చున్నారు. నన్ను చూసి తివారీ, అతని అనుచరులు అరవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత హింసాత్మక దాడికి పాల్పడ్డారు. నన్ను కూడా కొట్టారు. నా కుర్తా చించేశారు."

-సంగమ్ లాల్ గుప్తా, ప్రతాప్​గఢ్ ఎంపీ

ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya news) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: వారాంతంలో సరదాగా సీఎం సైకిల్ సవారీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.