ఉత్తర్ప్రదేశ్ ప్రతాప్గఢ్ జిల్లాలో భాజపా, కాంగ్రెస్ శ్రేణుల (BJP Congress News) మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రమోద్ తివారీ (Pramod Tiwari news) వర్గీయులు తనతో పాటు తన అనుచరులపై దాడి చేశారని భాజపా ప్రతాప్గఢ్ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా (Sangam Lal Gupta news) ఆరోపించారు. సంగిపుర్ తాలుకాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. తన చొక్కా సైతం చించేశారని గుప్తా ఆరోపించారు.
![uttar pradesh mp sangam lal gupta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13171292_199_13171292_1632575224585.png)
"నేను నా కార్యకర్తలు సంగీపుర్లోని మేళాకు వెళ్లాం. అక్కడ కాంగ్రెస్ మాజీ ఎంపీ తివారీ డయాస్పై కూర్చున్నారు. నన్ను చూసి తివారీ, అతని అనుచరులు అరవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత హింసాత్మక దాడికి పాల్పడ్డారు. నన్ను కూడా కొట్టారు. నా కుర్తా చించేశారు."
-సంగమ్ లాల్ గుప్తా, ప్రతాప్గఢ్ ఎంపీ
ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya news) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: వారాంతంలో సరదాగా సీఎం సైకిల్ సవారీ..