ETV Bharat / bharat

పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన మోదీ

author img

By

Published : May 6, 2021, 9:11 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించారు. కరోనా పరిస్థితులు, కట్టడి చర్యలపై అడిగి తెలుసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కరోనా పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వరుస సమీక్షలు జరుపుతున్నారు. తాజాగా.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఝార్ఖండ్​ ముఖ్యమంత్రులతో సహా.. పుదుచ్చేరి, జమ్ము& కశ్మీర్ లెఫ్టినెంట్​ గవర్నర్లతో అధికారులు తెలిపారు.

ఆయా రాష్ట్రాల్లో కొవిడ్​ పరిస్థితులు, నియంత్రణ చర్యలపై చర్చించడం సహా వ్యాక్సినేషన్​పై ఆరా తీసినట్లు సమాచారం.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ ఉన్నా వ్యాక్సినేషన్​ ఆగొద్దు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.