ETV Bharat / bharat

'పట్టణాభివృద్ధిలో భారత్ కొత్త పుంతలు'

author img

By

Published : Jul 16, 2021, 5:25 PM IST

Updated : Jul 16, 2021, 6:29 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ.. గుజరాత్​ గాంధీనగర్​లో ఆధునికీకరించిన రైల్వే స్టేషన్​లో ఫైవ్ స్టార్ హోటల్​ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పట్టణాభివృద్ధిలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు.

pm modi
ప్రధాని మోదీ

గుజరాత్​లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గాంధీనగర్​లో పునరుద్ధరించిన రైల్వే స్టేషన్​లో ఫైవ్ స్టార్​ హోటల్​ను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పట్టణాభివృద్ధిలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోందని మోదీ స్పష్టం చేశారు.

" దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి ఎంతో కీలకం. అందుకు ఆధునీకరించిన గాంధీనగర్ రైల్వేస్టేషన్ ఓ ఉదాహరణ. ఆధునిక సాంకేతికత వినియోగానికి ఇది నిదర్శనం. అన్ని రైల్వే స్టేషన్​లలో మౌలిక సదుపాయాల కల్పన వివిధ దశల్లో ఉంది. దేశంలోని ప్రతి ప్రాంతానికి రైల్వే సేవలు చేరటం ద్వారా ఆత్మనిర్భరత వృద్ధి చెందుతుంది. రైల్వేలో భద్రత, వేగం, పరిశుభ్రత, సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా రైళ్లు ప్రయాణిస్తాయి."

-- ప్రధాని నరేంద్ర మోదీ

కరోనా సంక్షోభాన్ని గుజరాత్​ అధిగమించిందని మోదీ అన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు త్రీటీ ఫార్ములాను అనుసరించాలని తెలిపారు. వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

దేశంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధే అజెండాగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే గుజరాత్‌లోని గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించారు. ప్రపంచ స్థాయిలో ప్రయాణికులకు సదుపాయాలు ఏర్పాటు చేయటం సహా రైల్వేస్టేషన్‌పై 5 నక్షత్రాల హోటల్‌ను నిర్మించారు. ఈ హోటల్‌ నిర్మాణంతో గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.​

ఇదీ చదవండి : రూ.1,100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

రైల్వేస్టేషన్ కమ్ 5స్టార్ హోటల్​ విశేషాలివే..

Last Updated : Jul 16, 2021, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.