ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 35 ఆక్సిజన్​ ప్లాంట్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

author img

By

Published : Oct 7, 2021, 12:10 PM IST

Updated : Oct 7, 2021, 12:51 PM IST

PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ

దేశవ్యాప్తంగా 35 పీఎస్​ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహా కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్​సుఖ్​ మాండవియా హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా పీఎం కేర్స్ నిధులతో(pm cares fund news) ఏర్పాటు చేసిన 35 పీఎస్​ఏ(ప్రెషర్​ స్వింగ్​ అడాప్షన్​) ఆక్సిజన్ ప్లాంట్లను(oxygen plants in india) ప్రధాని నరేంద్ర మోదీ(modi news latest) ప్రారంభించారు. ఉత్తరాఖండ్​ రిషికేశ్​ ఎయిమ్స్​లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. ఈ క్రమంలో మాట్లాడిన ప్రధాని.. కరోనాపై పోరులో భాగంగా స్వల్పకాలంలో వైద్య సదుపాయాలను అభివృద్ధి చేశామన్నారు. కరోనా విస్తరణ తొలిరోజుల్లో దేశంలో ఒక్క టెస్టింగ్​ లాబోరేటరీ ఉండగా.. ప్రస్తుతం 3000 టెస్టింగ్​ ల్యాబ్​లు ఉన్నట్లు తెలిపారు. అలాగే మాస్కులు దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి తయారు చేసి ఎగుమతి చేసే స్థితి ఎదిగామన్నారు. ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా.. కొవిన్ పోర్టల్​ ద్వారా భారీ సంఖ్యలో కరోనా టీకా డోసుల పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ​

ఈ ఆక్సిజన్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహా కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్​సుఖ్​ మాండవియా హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1,224 ఆక్సిజన్ ప్లాంట్లకు పీఎం కేర్స్​ ఫండ్స్(pm cares fund news)​ ద్వారా నిధులు మంజూరు చేసినట్లు ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది. వీటిలో 1,100లకు పైగా ప్లాంట్లు రోజుకు 1,750 మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​ను ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపింది.

దేశంలో కరోనా విస్తరణ నేపథ్యంలో తలెత్తిన ఆక్సిజన్​ కొరతను నివారించే దిశగా చర్యలు ప్రారంభించింది కేంద్రం. అలాగే వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటును ముమ్మరం చేసింది.

ఇదీ చూడండి: Covid cases in India: దేశంలో మరో 22వేల మందికి కరోనా

Last Updated :Oct 7, 2021, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.